Suryaa.co.in

Andhra Pradesh

ఆరా మస్తాన్ 1వ తేదీ ఎక్కడ ఉన్నారో చెప్పగలరా?

• ఆరోజు సజ్జల, ఆయన కుమారుడితో దాదాపు 4 గంటలు భేటీ
• సజ్జల ఇచ్చిన ఫలితాలనే ఆరా మస్తాన్ ప్రకటించాడు
ఉద్యోగులకు టీడీపీ అండగా ఉంటుంది
• ఓటమి భయంతో వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు
• ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీ అంతు చూస్తామని పేర్ని బెదిరిస్తున్నారు
• పేర్ని పేలితే ఇక్కడ భయపడే ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు ఎవరూ లేరు
• దాడులు దౌర్జన్యాలకు దిగేవారే కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్లమని చెప్పడం సిగ్గుచేటు
• దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా సజ్జలను అరెస్ట్ చేయకపోవడం దారుణం
• సజ్జల, పేర్నిలాంటి వ్యక్తులు బయట ఉంటే ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కావున పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాలి
– టీడీపీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి

ఓటమి భయంతో వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని.. ప్రభుత్వ ఉద్యోగులను కూడా బెదరిస్తున్నారని.. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. పేర్ని పేలితే ఇక్కడ భయపడే ఉద్యోగులు. టీడీపీ కార్యకర్తలు లేరని… ఉద్యోగులకు టీడీపీ అండగా ఉందన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సజ్జల, ఆయన తనయుడు ఇచ్చిన డైరెక్షన్ లో ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు వెల్లడించారని తెలిపారు. 1వ తేదీ ఆయన ఎక్కడ ఉంటో చెప్పాలని సవాల్ విసిరారు.

రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ… పేర్ని పేట్రేగితే భయపడే ఉద్యోగులు, టీడీపీ కార్యకర్తలు ఎవరూ లేరు. గత ఐదేళ్లుగా హింసించినా మొక్కవోని ధైర్యంతో టీడీపీ నేతలు నిలబడ్డారు. వైసీపీని చిత్కరించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పారు. వైసీపీ బెదిరింపులకు ఏ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయపడరు. టీడీపీ పార్టీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎనికల కౌంటింగ్ జరిగేలా ఉద్యోగులు చూడాలి.

దాడులు దౌర్జన్యాలకు దిగేవారే కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్లమని సజ్జల చెప్పడం సిగ్గుచేటు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా సజ్జలను అరెస్ట్ చేయకపోవడం దారుణం. సజ్జల, పేర్నిలాంటి వ్యక్తులు బయట ఉంటే ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది కావున పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవాలి. ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళాన్ని సృష్టించేందుకు వైసీపీనేతలు శత విధాల ప్రయత్నిస్తున్నారు.

2019లో అధికారం కోల్పోయిన ప్పుడు టీడీపీ హుందాగా ఓటమిని అంగీకరించింది. ప్రజలు ఇచ్చిన తీర్పును హుందాగా తీసుకోకుండ అల్లర్లను సృష్టించేందుకు వైసీపీ నేతలు చూస్తున్నారు. ప్రజలను ఉద్యోగులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పేర్ని, సజ్జలను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడాలి.

ఎన్డీఏ కూటమి అంఖడ విజయం సాధించబోతుంది. వైసీపీ అరాచక పాలన నుండి ఏపీ ప్రజానికానికి స్వేచ్ఛ స్వాతంత్రం వస్తుంది. ఆమేరకు ప్రజలు తీర్పు ఇచ్చారు. సర్వే సంస్థలు మెజార్టీ భాగం కూటమి గెలుస్తుందని చెప్పాయి. ఆరా మస్తాన్ మాత్రమే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

ఆరా మస్తాన్ కు సవాల్ చేస్తున్న. 1వ తేదీ మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 వరకు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా ? ఆరోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఆయన కుమారుడితో దాదాపు 4 గంటలు భేటీ అయ్యి వారు ఇచ్చిన సలహాలు సూచనలు అనుగుణంగా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ అధికారంగా వస్తుందని సర్వే ఫలితాలను వెల్లడించారు.

సజ్జల ఇచ్చిన ఫలితాలనే ఆరా మస్తాన్ ప్రకటించాడు. ఆరా సంస్థ చేసిన సర్వే అంతా తప్పే, ఉద్యోగులు, బయట నుండి వచ్చిన ఓటర్లంతా టీడీపీ కూటమికే ఓటు వేశారు. ఆరా మస్తాన్ ఆ సర్వే ఫలితాలు ఇవ్వకుంటే వైసీపీ తరఫున కౌంటింగ్ కు వెళ్లేవాడు లేడు. కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లను తీసుకెళ్లెందుకు ఆరా మస్తాన్ ను పావుగా ఉపయోగించుకున్నారు అంతే. గెలుకు కూటమిదే. ఎన్నికల పలితాలను చూసి రేపు ఆరా మస్తాన్ కు, వైసీపీ నేతలకు కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

LEAVE A RESPONSE