Suryaa.co.in

Andhra Pradesh

ఏవీ సుబ్బారెడ్డిపై కేసు

నంద్యాల: మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

గత రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్న సమయంలో దుండగుల కారు వేగంగా వచ్చి నిఖిల్‌ను ఢీకొట్టింది. ఆపై కింద పడిన నిఖిల్‌‌ను కారులో వచ్చిన దుండగులు రాడ్‌లతో దాడికి యత్నించారు. దీంతో నిఖిల్ తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు కారులో పారిపోయారు.

ఈ ఘటనలో నిఖిల్ తలకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అఖిలప్రియ వెంటనే బయటకు వచ్చి దాడిపై ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సీసీ పుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A RESPONSE