Suryaa.co.in

Andhra Pradesh

అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమే.. : చంద్రబాబు

సైకిల్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సైకిల్ కు ఎలెక్ట్రిక్ హంగులు తీసుకొచ్చామని… ఇక దూసుకుపోడమేనని, అడ్డం వస్తే తొక్కుకుంటూ పోవడమేనని చెప్పారు. జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం అందరిలో కనిపిస్తోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా ఎదుర్కోవడానికి సైకిల్ రెడీగా ఉంటుందని చెప్పారు. సంక్షేమ పథకాలకు నాంది పలికిందే టీడీపీ అని, ఎన్టీఆర్ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ అమలు చేసిందని అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదని… 2029 నాటికి ఏపీని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు చెప్పారు. నష్టపోయిన రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో గట్టెక్కిస్తామని తెలిపారు. సైకో జగన్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడని విమర్శించారు. ప్రజావేదికను కూల్చడంతో పాలనను ప్రారంభించిన జగన్… ఇప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి, రివర్స్ పాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. పోలవరంను గోదావరిలో కలిపేశాడని, రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని చెప్పారు.

తండ్రిలేని బిడ్డను అని చెప్పుకుని, కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య వంటి వాటితో జగన్ అధికారంలోకి వచ్చాడని చంద్రబాబు అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను తెస్తానని చెప్పిన జగన్… కేసుల కోసం కేంద్రం ముందు తల వంచాడని ఎద్దేవా చేశారు. మద్యంపై నిషేధం విధిస్తానని చెప్పి, మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నాడని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్ అని… రాష్ట్ర ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నారని అన్నారు. ప్రతి పేదవాడిని ధనికుడిని చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చెప్పారు.

తెలుగు దేశం పార్టీ మహానాడులో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం:-
• ఈ మహానాడు ప్రత్యేకమైనది. క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది….ఎనర్జీ వచ్చింది.
• ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు పోదాం
• ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఆయనను తెలుగు జాతి స్మరించుకుంది
• తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు…తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్
• అలాంటి మహానాయకుడికి మనం వారసులం. రాజమహేంద్రవరం…ఎన్టీఆర్ మెచ్చిన నగరం. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలకు రాజమహేంద్రవరం వేదిక
• నన్నయ..ఇక్కడే నడయాడాడు…కందుకూరి వీరేశిలింగం ఇక్కడే పుట్టాడు. ఇక్కడే కాటన్ నివసించాడు…ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చాడు.
• కాటన్ చేసిన సేవలకు గాను….ప్రతి ఊళ్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఇది ఆయనకు దక్కిన గౌరవం.
• ఇది చారిత్రిక మహానాడు….ఒకవైపు ఎన్టీఆర్ శతజయంతి….మరో వైపు 42 ఏళ్ల ప్రయాణం.
• తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదాం అని సంకల్పం తీసుకుందాం.
• తెలుగు దేశం పార్టీ జెండా చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది. పుసుపు రంగు అనేది శుభసూచకం.
• మన పార్టీ ఎంబ్లమ్ లో నాగలి, చక్రం, ఇల్లు పెట్టారు. రైతులను శాశ్వితంగా గుర్తుపెట్టుకోవాలని నాడు నాగలి పెట్టారు. శ్రమ జీవుల కోసం చక్రం పెట్టారు. పేదల కోసం ఇళ్లు పెట్టాడు.
• తెలుగు దేశం జెండా…తెలుగు జాతికి అండ. తెలుగు దేశం సింబల్ సైకిల్..ముందు చక్రం అంటే సంక్షేమం….రెండో చక్రం….అభివృద్ది. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది. దాంతో ఇక దూసుకుపోవడమే.
• నాలుగేళ్లలో కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. అరెస్టులు, కేసులు, దాడులకు ఏ ఒక్క నాయకుడు భయపడలేదు.
• మాచర్లలో చంద్రయ్యను చంపే సమయంలో అతన్ని జై జగన్ అంటే వదిలేస్తా అన్నారు…కానీ ప్రాణాలు వదులుకున్నాడు కానీ…..జై జగన్ అనలేదు. జై తెలుగుదేశం అని ప్రాణాలు ఇచ్చాడు.
• అందుకే చంద్రయ్య పాడె మోశాను. కుటుంబ పెద్దగా కార్యకర్తలకు అండగా ఉంటాను..తోడుగా ఉంటాను.
• అనేక సవాళ్లను ఎదుర్కొని తెలుగు దేశం కార్యకర్తలు నిలబడ్డారు….మీ అందరి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నా…..శిరసు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నా.
• భవిష్యత్ లో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది అని చెపుతున్నా. ఎన్టీఆర్ శతజయంతి సాక్షిగా…ఈ మహానాడులో చెపుతున్నా….మీకు అండగా నేను ఉంటా
• సంపద సృష్టించడమే కాదు …పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ
• ఏపిలో సంక్షేమ పథకాలు మొదలు పెట్టిందే తెలుగు దేశం. రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు రూ.50 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చాం. దేశంలో మొదటి సారి పేదలకు పెన్షన్ ఇచ్చిన పార్టీ టీడీపీ.
• 2014లో రూ.200 పెన్షన్ ఉంటే….రూ.2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ
• 2014 తరువాత వందల సంఖ్యలో పథకాలు అమలు చేశాం.
• హైదరాబాద్ నగరాన్ని మనమే అభివృద్ది చేశాం. విభజన తరువాత ఎపి ని అభివృద్ది చేయాలని పని చేశాను.
• 2029 నాటికి ఎపిని దేశంలో నెంబర్ 1 స్టేట్ చేయాలని పనులు చేశాం.
• వ్యవసాయంలో 11 శాతం వృద్ది రేటు సాదించాం….ఇరిగేషన్ పై 64 వేల కోట్లు ఖర్చు చేశాం.
• 16 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం…ఆ పెట్టుబడులు వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి.
• 2019లో ఒక్కడు వచ్చాడు….ఎన్నో మాటలు చెప్పాడు. మోసం చేశాడు.
• రాష్ట్రంలో సిఐడి ప్రభుత్వం ఉంది. సిఐడి అంటే కరప్షన్, ఇన్ ఎఫిషియంట్, డిస్ట్రక్షన్ ప్రభుత్వం
• రివర్స్ టెండర్లు అన్నాడు…పరిపాలనను రివర్స్ చేశారు. ప్రజా వేదిక కూల్చి వేతతో పాలన మొదలు పెట్టాడు.
• అమరావతికి మనం రూపం ఇస్తే…..దాన్ని విద్వంసం చేశాడు. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం లేదు.
• అమరావతి ని నాశనం చేసి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వ్యక్తి జగన్ రెడ్డి
• పోలవరం పూర్తి అయ్యి నదుల అను సంధానం జరిగితే మంచి ఫలితాలు వచ్చేవి.
• ఒక్క రోడ్డు వేయలేదు…ఒక్క ప్రాజెక్టు కట్టలేదు…..ప్రభుత్వ ఉగ్రవాదంతో ఒక్క పెట్టుబడి రాలేదు.
• జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ లేదు….జాబ్స్ లేవు.
• దిశ చట్టం అన్నాడు…ఎక్కడ ఉందో చెప్పాలి. లేని చట్టం పేరుతో రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ పెట్టాడు.
• ఉద్యోగం రావాలి అంటే ప్రత్యేక హోదా కావాలి అని నాడు జగన్ అన్నాడు. 25 మందిని గెలిపిస్తే….ప్రత్యేక హోదా సాధిస్తాను అని…ఇప్పుడు మెడలు దించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు.
• అమ్మఒడి ఒక నాటకం…నాన్న బుడ్డి వాస్తవం. ఎన్నికల సమయంలో మద్య పాన నిషేదం అని చెప్పిన పెద్ద మనిషి…మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు.
• జగన్ నాలుగేళ్ల తప్పిదాలపై చెప్పాలంటే మన ఒక్క మహానాడు సమయం సరిపోదు. అందుకే ఈ నాలుగు నెలల్లో ఏం జరిగిందో…ఓ 16 ఉదాహరణలు చెపుతాను.
• గత నాలుగు నెలల్లో జరిగిన 16 ఘటనలు, తెరపైకి వచ్చిన అంశాలు
• ఎపి నుంచి ఐటి ఎగుమతులు కేవలం 0.02 శాతం
• జల్ జీవన్ మిషన్ లో రాష్ట్రం 18 ర్యాంక్
• రైతుల ఆత్మహత్యల్లో ఎపి 3 స్థానం. రైతు అప్పుల్లో టాప్.
• ఎఫ్ డిఐ పెట్టుబడుల్లో రాష్ట్రం స్థానం 14
• రాష్ట్రంలో నేటి అప్పులు రూ.10 లక్షల కోట్లు పైగా
• దేశంలో రిచ్చెస్ట్ సిఎంగా మన సిఎం జగన్. రూ. 510 కోట్లు.
• రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 35 శాతం.
• నిర్మాణ రంగ సంక్షోభంతో శ్రీకాకుళం జిల్లాలో మే 26, 2023 న పురుషోత్తం సాహు అనే భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య. అయినా ఈ ప్రభుత్వానికి లెక్కలేదు.
• అన్నమయ్య జిల్లాలో మే 22, 2023 న కృష్ణయ్య (29) అనే యువ రైతు వర్షాలకు పంట దెబ్బతినడంతో ఆత్మహత్య.
• రూ.1500 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలతో సేవల నిలిపివేత.
• ఏప్రిల్ 18న గుంటూరు మున్సిపాలిటీలో వైసీపీ కార్పొరేటర్ వేధింపులకు కనపర్తి విమల అనే మహిళ ఆత్మహత్య.
• తిరుమలలో గంజాయి వ్యాపారం. మార్చి 28 పట్టుబడిన ఉద్యోగి.
• 6 నెలల చెత్తపన్ను ఒకే సారి వసూలుకు నిర్ణయం
• చిత్తూరు జిల్లాలో త్రాగునీటిని సరఫరా చేసిన వారికి రూ.225 కోట్లు బిల్లులు పెండింగ్.
• మార్చి 7 న చింతపల్లి మండలంలో అడవి లో ఆడబిడ్డ ప్రసవం.
• సాలూరు మండలంలో రూ. 4 లక్షలు సొంతంగా పోగేసుకుని రోడ్డు వేసుకున్న గిరిజనులు.
• నాలుగు నెలల్లో ఇన్ని ఘటనలు జరిగాయి. అందుకే అడుగుతున్నా…అందుకే అంతా సమిష్టిగా పోరాటం చేయాలి.
• దేశంలో అందరి సిఎం ఆస్తి రూ.508 కోట్లు. జగన్ ఒక్కడి ఆస్తి రూ.510 కోట్లు. ఇతను పేదల ముఖ్యమంత్రి అంటాడు.
• దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయంలో చివరి స్థానంలో ఎపి. అంటే ధనిక ముఖ్యమంత్రి…..పేద ప్రజలు
• జగన్ ఇసుక, మద్యం, భూములు, గనులు..ఇలా ఏది దొరికితే అది దోచుకున్నాడు. నాలుగేళ్లలో రూ. 2.27లక్షల కోట్లు దోచుకున్నాడు.
• దేశంలో ఎక్కువ ధరలు ఉండే రాష్ట్రం ఎపి. ఎక్కడో ఉండే అమూల్ ను ఎపికి తెచ్చాడు ఈ అమూల్ బేబీ.
• ఏ స్కీం తీసుకున్నా…..అందులో స్కాం ఉంటుంది. ఈ సైకో పొట్ట పెద్ద అబద్దాల పుట్ట.
• లేచింది మొదలు అన్నీ అబద్దాలే. కోడికత్తి డ్రామా చూశారుకదా. ఇప్పుడు వివేకా హత్య పై మొత్తం తేలాలి.
• రావణాసుడు సీతను అపహరించి నప్పుడు…..సాదువు వేషంలో వచ్చాడు..అప్పుడు నమ్మి సీత లక్ష్మణ రేఖ దాటుతుంది. అలాగే ఒక్క చాన్స్ అని వచ్చిన జగన్ దొంగ మాటలు చెప్పి వచ్చాడు. మనం జగన్ ను ఇంటికి పంపాలి.
• జగన్ రూ. 2000 నోట్లు దాచి పెట్టాడు. టీడీపీ పెద్ద నోట్ల రద్దు డిమాండ్ చేసింది. డిజిటల్ కరెన్సీ రావాలి అనేది మన డిమాండ్, విధానం.
• ఈ రోజు రేపు అన్ని విషయాలు చర్చిద్దాం….రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవాలి.
• సంపద సృష్టించేది మనమే….సంపదను పంచేది మనమే.
• పి4 అనే విధానంతో పేదలను సంపన్నులను చేద్దాం.
మీ అందరితో చర్చించిన తరువాత రేపు మ్యానిఫెస్టో లో ఫేజ్ 1 ప్రకటిద్దాము.
• ప్రజలు మెచ్చేలా…అదిరిపోయే సంక్షేమం చేద్దాం.
• రాజమహేంద్రవరం అదిరిపోయింది….రేపు దద్దరిల్లి పోతుంది. రాష్ట్రంలో ఉండే అందరి చూపూ రాజమండ్రి పైనే. అన్ని రోడ్లూ రాజమండ్రి వైపే వస్తాయి.
• 2024లో ఎన్నికలు వచ్చినా……అంతకంటే ముందు వచ్చినా మనం సిద్దమే.
• నిరంతరం సంపద సృష్టించి…ఆ సంపదను పేదలకు పంచి….పేదలను ధనికుడిని చేద్దాం.
• జగన్ కు ఆయన ఒక్కడే ధనికుడిగా ఉండాలి…నా సంకల్పం ప్రజలు ధనికులుగా ఉండాలి. దీనికి సారధులు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు.
• ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా మార్చే సత్తా తెలుగు దేశం పార్టీకే ఉంది.
• టెక్నాలజీ ద్వారా క్యాడర్ కు….అధిష్టానానికి గ్యాప్ పోయింది.
• యువగళం అద్భుతంగా జరుగుతోంది. బాదుడే బాదుడు….బాగా చేశారు.
వచ్చేది కురుక్షేత్రం…..ఆ యుద్దంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం. శాసన సభను గౌరవ సభ చేసి అసెంబ్లీకి వెళదాం.

LEAVE A RESPONSE