మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు

– ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పా
– బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు?
– తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు
– రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి
– పార్టీలో కొత్త రక్తం కోసం అంతా సహకరించాలి
– మహానాడు లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం
– మహానాడుకు ఏర్పాట్లు బాగున్నాయి అంటూ ముందుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలకు చంద్రబాబు అభినందనలు

తెలుగు దేశం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో జరుగుతున్న ఈ మహానాడు ప్రత్యేకం. రాష్ట్రానికి దశ దిశ నిర్థేశించే స్థలంగా ఈ మహానాడు ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలను తెలుగు దేశం అవిర్భావం ముందు…తెలుగు దేశం ఆవిర్భావం తరువాత అని లెక్కించుకోవాలి. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి….రాక్షస పాలన వచ్చింది.

ప్రశ్నిస్తు దాడులు చేసే సంస్కృతి ని వైసిపి తీసుకువచ్చింది.నేతల అరెస్టులు, కార్యకర్తలపై దాడులు జరిగితే నిద్రలేని రాత్రులు గడిపాం. వైసిపి ప్రభుత్వానికి అభివృద్ది చేతకాదు…వాళ్లు చెపుతున్న సంక్షేమం
TDP6ఒక బూటకం. నాడు రౌడీలను అణిచివేసిన పోలీసులు ఇప్పుడు ఉన్మాది పాలనలో గాడి తప్పారు. జగన్ నమ్ముకున్న అధికారులు నాడు జైలుకు వెళ్లారు. తప్పుడు పనులు చేసిన వారు మళ్లీ జైలుకు వెళతారు.

పన్నులు, ధరలతో ప్రజలపై బాదడే బాదుడు తో జీవితాలు చిన్నాభిన్నం చేశారు. బాదుడే బాదుడు డబ్బులు, ప్రభుత్వ ఆదాయం, అప్పుల డబ్బులు ఎక్కడికి పోతున్నాయి. రైతులకు జగన్ పాలనలో తీవ్ర ద్రోహం జరుగుతుంది. గిట్టుబాటు ధర అందడం లేదు. ఇప్పుడు చంద్రన్న భీమా లేదు, అన్న క్యాంటీన్ లేదు, సంక్రాంతి కానుకలేదు….ఇంకెక్కడ ఉంది సంక్షేమం. ఒకే దఫా 50 వేల రూపాయలు రుణమాఫీ చేసింది టిడిపి ప్రభుత్వం. జగన్ 7 వేలు ఇచ్చి గొప్పలు చెపుతున్నారు.

జగన్ చెప్పిన మద్యనిషేదం ఏమయ్యింది…మద్యం లో 25 ఏళ్ల ఆదాయం చూపి అప్పులు తెచ్చిన సిఎం జగన్.రాష్ట్రంలో అప్పులు 8 లక్షల కోట్లకు వెళ్లినా అభివృద్ది మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రంలో ఇసుక
TDP3 ధర ఎందుకు పెరిగింది….సిమెంట్ ఎందుకు పెరిగింది. జగన్ అవినీతి వల్లనే ధరలు పెరిగాయి. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఏమయ్యింది…పోలవరం ఎందుకు పూర్తి కాలేదు.? ఉమ్మడి రాష్ట్రంలో ISB లాంటి కంపెనీల కోసం ఎంతో కష్ట పడ్డాను. స్వయంగా ఆ సంస్థ ప్రతినిధులకు భోజనం వడ్డించి…గౌరవించి నాడు ఐఎస్బి తెచ్చాను. ఎవరు గుర్తించినా గుర్తించకున్నా….నాకు ఇప్పుడు ఆ తృప్తి ఉంటుంది.

తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు…ఎపికి అమరావతి తీసుకురావాలి అనున్నా. ఏం పాపం చేసిందని జగన్ అమరావతిని నాశనం చేశారు? పోలవరం రాష్ట్రానికి వరం…అలాంటి ప్రాజెక్టును జగన్ బలిపెట్టారు. పోలవరం విశిష్టత కూడా తెలియని సిఎం జగన్..దాని వల్ల రాష్ట్రం నష్టపోయింది. 3 ఏళ్లలో 3 ఇళ్లు కట్టిన జగన్….ఇప్పుడు 30 లక్షల ఇళ్లు కడతాం అంటున్నాడు టిడిపి 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేస్తే…జగన్ రెండు కిలోమీటర్ల రోడ్డు వెయ్యలేదు.

మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు. ప్రజలు సిఎం సిఎం అని స్లోగన్స్ ఇస్తున్నారు…..నాకు సిఎం పదవి కొత్తకాదు..కానీ రాష్ట్రం కోసం నా తపన. ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పాను.జగన్ కు ఒక్క చాన్స్ అని అవకాశం ఇస్తే రాష్ట్రం నాశనం అయ్యింది. జగన్ పాలనలో తప్పులను ప్రజలు నడిరోడ్డులో నిలదీయాలి.

డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రశాంతమైన కోనసీమలో గొడవలకు ఈ ప్రభుత్వమే కారణం. అంబేద్కర్ పై జగన్ కు గౌరవం ఉంటే అమరావతిలో 125 అడుగుల విగ్రహం ప్రాజెక్టను ఎందుకు నిలిపివేశారు. కోనసీమలో మంత్రి ఇల్లు తగలబడిన ఘటనలో అనేక అనుమానాలు
TDP5ఉన్నాయి. మీరే దాడి చేసుకుని…మీరే రాజకీయం చేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.గడపగడపకూ వైసిపి కార్యక్రమానికి జనం రాకపోవడంతో గడప గడపకూ ప్రభుత్వం అన్నారు. జగన్ సభల్లోంచి జనం బయటకు వెళ్లిపోతున్నారు. జనం వెళ్లిపోవడం సహాయ నిరాకరణకు నిదర్శనం.

జగన్ రాజ్యసభ ఎవరికి ఇచ్చారు….రాజ్యసభ సీట్లు ఇచ్చిన వారిలో ముగ్గురు సహ నిందితులు, ముగ్గురు ఇతర రాష్ట్రాల వారు. ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఒక్కరికి రాజ్యసభ ఇవ్వలేదు.బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు. జగన్ ఆదాయం పెరిగింది…అనుచరుల ఆదాయం పెరిగింది….కానీ ప్రజల ఆదాయం పెరగలేదు.

వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేసింది ఎన్టీఆర్. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వం. రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి. రైతుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది.
TDP1వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి. కార్యకర్తలే కాదు.. సాధారణ ప్రజలను ఇబ్బంది పడుతోన్న పరిస్థితి. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. జగన్ పాలనలో అభివృద్ధి నాటకం.. సంక్షేమం బూటకం.

ఒక ఉన్మాది చేతుల్లో పోలీసులు బలి కాకూడదు. జగన్ పాలన గురించి డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఆలోచించుకోవాలి. తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు. మహిళలపై అరాచకాలు పెరిగాయి.మద్యం, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి.. ఏపీ నేరాంధ్రప్రదేశుగా మారుతోంది.

టీడీపీ హయాంలో ప్రారంభించిన ISB 20 ఏళ్ల వార్షికోత్సవానికి ప్రధాని వచ్చారు. జగన్ అబద్దాల్లో దిట్ట. ఎన్నికల ముందు బాబాయ్ హత్య గుండె పోటు అంటూ జగన్ ప్రచారం చేశారు.గొడ్డలి పోటును గుండె పోటు అని చెప్పుకుని సింపతీ ఓట్లేయించుకున్నారు. కోడి కత్తి డ్రామా ఏమైంది..? బాబాయ్ మరణం గుండెపోటుగా మారితే.. కాకినాడలో సుబ్రమణ్యం హత్య రోడ్ ప్రమాదంగా మారింది.

రాష్ట్రంలో జగన్ ఇచ్చిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి అంటే వాలంటీర్ ఉద్యోగాలు. జగన్ చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమయ్యింది.టిడిపి హయాంలో ఒప్పందం చేసుకున్న గ్రీన్ కో వాళ్లతో ఇప్పుడు దావోస్ వెళ్లి జగన్ తిరిగి ఒప్పందం చేసుకున్నారు.టిడిపి మరో 40 ఏళ్లు సమర్థవంతంగా పని చెయ్యాలి.

ఆవిర్భావం దినోత్సవంలో చెప్పినట్లు ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తాను. పార్టీలో కొత్త రక్తం
TDP4 కోసం అంతా సహకరించాలి.జగన్ రాజకీయాల నుంచి దిగిపోతే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావు. రాష్ట్ర ప్రజలకు ఒకటే పిలుపు ఇస్తున్నా…క్విట్ జగన్…సేవ్ ఆంధ్ర ప్రదేశ్.

Leave a Reply