Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వరు

-అపాయింట్మెంట్ లభించదని ముందే చెప్పా
-ఎన్నికల కోడ్ వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డికి టైం ఇవ్వడం అసలు మంచిది కాదు
-రెండు కంపెనీల కోసం 20వేల ఎకరాల స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి
-రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలాన్ని కేటాయించలేరా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని నేను ముందే చెప్పానని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.. ఇప్పుడు అదే జరిగిందన్నారు. వరుసగా శని, ఆదివారాలు సెలవులు వస్తున్నాయన్న ఆయన, ఐదవ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఈనెల 5వ తేదీన విచారణకు రానుందని పేర్కొన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వరు. పార్లమెంటు సమావేశాల అనంతరం ఎన్నికల కోడ్ వచ్చే ముందు, జగన్మోహన్ రెడ్డికి టైం ఇవ్వడం అసలు మంచిది కాదు. కేవలం కంఠశోష మాత్రమేనని ఆయన అన్నారు. రైల్వే జోన్ కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించమని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు.

రైల్వే జోన్ కోసం స్థలాన్ని ఇస్తే, పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి
ఎంతో నష్టం జరిగిందన్న రఘురామకృష్ణంరాజు, రెండు కంపెనీల కోసం 20వేల ఎకరాల స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి, రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలాన్ని కేటాయించలేరా? అంటూ నిలదీశారు.

రైల్వే జోన్ వస్తే ఎన్నో ఉద్యోగాలు వచ్చేయని, ఎంతో అడ్వాంటేజ్ లభించేదని పేర్కొన్నారు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి పాలెగాళ్లు ఎన్నో వేల ఎకరాలను దోచుకున్నారన్న ఆయన, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ కోసం కచ్చితంగా స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చిన తర్వాత మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటి అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

బడ్జెట్లో రైల్వే కారిడార్, ఆక్వా రంగాలను స్పృశించడం పట్ల హర్షం
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నర్సాపురం, భీమవరం రైల్వే కారిడార్ అభివృద్ధి గురించి, ఆక్వా రంగం అభివృద్ధి గురించి స్పృశించడం ఎంతో ఆనందంగా ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రజల జీవన ఆధారమైన ఆక్వా రంగం ఈ బడ్జెట్ లో ప్రముఖ పాత్ర చోటు చేసుకోవడం ఆనందదాయకమన్నారు. రైల్వే భోగిలను సాధారణ రైల్వే భోగిల తరహాలో కాకుండా వందే భారత్ రైలు తరహాలో రైల్వే భోగిలను రెండు మూడు నెలల వ్యవధిలో ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. భవిష్యత్తులో నరసాపురం, భీమవరం రైల్వే కనెక్టివిటీ ఎంతో మెరుగు కానుందని చెప్పారు.

ఆక్వా ఎక్స్పో 30 వేల కోట్ల నుంచి 60 వేల కోట్లకు పెరిగింది
దేశం నుంచి ఆక్వా రంగం ఎక్స్పోర్ట్ 30 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తెలిపారని, భవిష్యత్తులో లక్ష కోట్ల రూపాయలకు ఆక్వారంగా ఎగుమతులను పెంచాలన్నదే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో ఐదు, ఆరు మెగా ఆక్వా పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు, ఐదు టన్నుల హిల్డ్ పెంచడం కోసం భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు.

రాష్ట్రం నుంచి 60% ఆక్వా ఎక్స్పోర్ట్ జరిగితే, 50% నా నియోజకవర్గం నుంచి జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఓటాన్ అకౌంటు బడ్జెట్లో ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్య ఇవ్వడం, గతంలో ఇచ్చిన తాము విజ్ఞప్తుల మేరకు జరిగిందన్నారు. ఈ కక్కుర్తి గవర్నమెంట్లో వాటర్ పైప్ లైన్ వ్యవస్థను వాడుకోలేదు. రానున్న ప్రభుత్వంలో ఆక్వా పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రెగ్యులర్ గా రైల్వే మంత్రికి, సికింద్రాబాద్ జనరల్ మేనేజర్, విజయవాడ డిఆర్ఎం కు ఇచ్చిన విజ్ఞాపన ప్రతి పత్రాల మేరకే రైల్వే కారిడార్ ఇంప్రూవ్మెంట్ గురించి అన్ని ఉత్పత్తులు మా ప్రాంతంలో ఫ్రెడ్ కారిడార్లోఒక చక్కటి ఇంటిగ్రేషన్ ఉండేలా కృషి చేయడానికి ఒక్కచోట అవకాశం ఉందన్నారు.

ఎమ్మెల్యే లుగా అవకాశాన్ని కోరుతున్న ఎంపీలు
పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలుగా అవకాశాన్ని కోరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైకాపా ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించారో అందరికీ తెలుసునున్న ఆయన, తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు మాత్రం ముగ్గురు ఎంపీలు ఉన్నప్పటికీ, ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు సమావేశాన్ని నిర్వహించారన్నారు.

LEAVE A RESPONSE