వెంకాయమ్మ కుటుంబంపై దాడిని ఖండించిన చంద్రబాబు

అమరావతి:- గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై దాడిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. జగన్ పాలనను విమర్శిస్తే దాడులు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం వెంకాయమ్మ పై దాడి చేసిన వైసీపీ వర్గీయులు నేడు వెంకాయమ్మ కొడుకుపై దాడి చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. ఒక దళిత మహిళ పై దాడులు కొనసాగుతుంటే పోలీసుల ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక కుటుంబం పై అరాచక శక్తులు పదే పదే దాడుల చేస్తుంటే అడ్డుకోలేక పోవడం పోలీసుల వైఫల్యం కాదా అని చంద్రబాబు మండిపడ్డారు. వెంకయమ్మ కుటుంబం పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Leave a Reply