– 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు
తమపై నమోదైన కేసుల పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు, ఇతర నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.