Suryaa.co.in

Andhra Pradesh

ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల

18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలు
ఏప్రిల్ 26న పరిశీలన
మే 13న పోలింగ్
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది అని తెలిపారు. మే 13న రాష్ట్రంలో పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని నెల్లూరు పర్యటనలో ముఖేష్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE