ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. “ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గం. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం. నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు” తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.