పెట్రోల్,గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన

Spread the love

విజయవాడ : పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. లెనిన్ సెంటర్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ మోదీ, జగన్ ఇద్దరూ ఒక్కటే.. కలిసే డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మోదీ ఆదేశాలతోనే జగన్ పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ… ప్రజలపైనే మోయలేని భారాలు మోపుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పెట్రోల్‌పై పన్నులు, విద్యుత్ ఛార్జీలను జగన్ తగ్గించాలని డిమాండ్ చేశారు. మోదీ, జగన్‌లు ఆడే జగన్నాటకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వారం రోజుల పాటు ఈ భారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. మోదీ మాయలో ఉన్న జగన్ కళ్లు తెరవాలని లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని శైలజానాథ్ హెచ్చరించారు.

Leave a Reply