Suryaa.co.in

Telangana

జైత్రం నాయక్ కుటుంబానికి అండగా కాంగ్రెస్

– టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో మానవత్వంలేని పాలన సాగుతోంది. జీవో 317 కారణంగా అనేక మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు బలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మరణించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి పరామర్శించిన పాపాన పోలేదు. కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజే నేను వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులతో నిర్బంధించారు. ఫోన్ లో పరామర్శించాల్సి వచ్చింది. 317 జీవో అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ – బీజేపీలో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించే స్థానంలో ఉన్న బీజేపీ మరింత జఠిలం చేసే లబ్ధి పొందాలనుకుంటోంది. ఉపాధ్యాయ – ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. వారికి అండగా ఉంటుంది. జైత్రం కుటుంబానికి న్యాయం చేయాలని ఫోన్ లో కలెక్టర్‌తో మాట్లాడాను.

LEAVE A RESPONSE