– ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గవర్నర్కు ఆహ్వానం
విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఒడిస్సాలోని భువనేశ్వర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు.
విజయవాడ రాజ్ భవన్లో గవర్నర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26న ఉదయం విగ్రహ ప్రతిష్టా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 21వ తేదీ నుండి విగ్రహ ప్రతిష్టా పూజా కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, మిధున లగ్నంలో నిర్వహించే స్వామి వారి ప్రాణ పతిష్టకు విచ్చేయాలని గవర్నర్ను కోరారు.
సానుకూలంగా స్పందించిన గవర్నర్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారని అభినందించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు బిసి బెహర, పివి నరసింహన్, తదితరులు పాల్గొన్నారు.