Suryaa.co.in

Telangana

డీఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవినీతి

– గ్రూప్ 1 ఫలితాల్లో గోల్ మాల్
– కాంగ్రెస్ అంటేనే కరప్షన్
– కాంట్రాక్టర్ల దగ్గర 20 పర్సంటేజ్
– ఏంది ఈ ఘోరం?
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి

హైదరాబాద్: డీఎస్సి స్పోర్ట్స్ కోటలో అవినీతి జరిగిందని ఆధారాలను సైతం సేకరించి అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రిజర్వేషన్ క్యాటగిరీల్లో మొదట 33 మందిని భర్తీ చేసినప్పుడు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అనేక మంది అభ్యర్థులను కాదని, ఎటువంటి ప్రతిభ చూపకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు.

పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చినా, పిర్యాదులు చేసినా మూడు సార్లు సర్టిఫికెట్లు పరిశీలించి కూడా ఇప్పటికి ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదు. ఓపెన్ క్యాటగిరి లో ఉన్న 63 మందిని ఎప్పుడు భర్తీ చేస్తారని, ప్రతి రోజు అభ్యర్థులు ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణాలు చేస్తున్నా కనీసం సమాధానం చెప్పేటోడే లేదు.

ఒకవైపు గ్రూప్ 1 ఫలితాల్లో గోల్ మాల్ మరోవైపు డీఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవినీతి. ఏంది ఈ ఘోరం? కాంట్రాక్టర్ల దగ్గర 20 పర్సంటేజ్, పెన్షనర్ల దగ్గర పర్సంటేజ్, పర్మిషన్ కి పెమెంట్స్, పథకాల వర్తింపు కోసం పైసలు, ఉద్యోగాల భర్తీలో డబ్బులు చేతులు మారడం… ఇలా కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని మరోసారి రుజువు చేసుకున్నారు.

ప్రభుత్వం వెంటనే డీఎస్సి స్పోర్ట్స్ కోట పై విచారణ చేపట్టి వాస్తవాలను తేల్చి, స్పోర్ట్స్ కోట ఉద్యోగాల్ని తక్షణమే భర్తీ చేయాల్సిందిగా, స్పోర్ట్స్ కోట అభ్యర్థులకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE