– వచ్చిన సొమ్ముతో మసీదులు, మదర్సాలు కడుతున్నాయి
– కూల్ డ్రింక్ కంపెనీలపై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
మార్కెట్లో కూల్ డ్రింక్ ల పేరుతో విషాన్ని అమ్ముతున్నారని, కూల్ డ్రింక్స్ కంపెనీలు షర్బత్ జిహాద్ కు పాల్పడుతున్నాయని యోగ గురువు రాందేవ్ బాబా ఆరోపించారు.
‘కూల్ డ్రింక్ తో మీ శరీరంలోకి విషం చేరడంతో పాటు మీ జేబులోని డబ్బు మసీదులు, మదర్సాల నిర్మాణానికి వెళుతోంది’ అని హెచ్చరించారు. పతంజలి సంస్థ నుంచి తీసుకొచ్చిన రోజ్ షర్బత్ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలో రాందేవ్ బాబా ఈ ఆరోపణలు చేశారు.
‘ఇది షర్బత్ జిహాద్. కూల్డ్రింక్స్ పేరుతో కంపెనీలు అమ్ముతున్న మరుగుదొడ్లను శుభ్రం చేసే విషం నుంచి మీ కుటుంబాన్ని కాపాడండి. పతంజలి షర్బత్, జ్యూస్లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి. ఈ షర్బత్ మీ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మీ డబ్బు గురుకులాలు, పతంజలి యూనివర్సిటీ నిర్మాణానికి ఉపయోగపడుతుంది’ అని రాందేవ్ బాబా వీడియోలో సూచించారు. జనాలకు విషాన్ని అమ్ముతూ వచ్చిన సొమ్ముతో మసీదులు, మదర్సాలు కడుతున్నాయని ఆరోపించారు.