Suryaa.co.in

Andhra Pradesh

రామతీర్థం దేవాలయ అభివృద్ధి

-దేవాలయాల సంరక్షణతో పాటు భక్తుల మనోభావాలను కాపాడతాం
-శ్రీరామ నవమిని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్

ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నవమి అనగానే నాకు నాడు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో చేసిన అభివృద్ధి గుర్తుకు వచ్చింది. దీనితో పాటు మూడేళ్ల క్రితం విజయనగరం రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను తొలగించిన దారుణ ఘటనా గుర్తుకు వచ్చింది.

2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయి. రథాలు తగలబడ్డాయి. అర్చకుల పై దాడులు జరిగాయి. కలియుగ వైకుంఠ దైవం తిరుమల ఏడుకొండల వాడి పుణ్యక్షేత్రంతో సహా అనేక హిందూ దేవాలయాల పవిత్రత దెబ్బతీసే అనేక చర్యలు జరిగాయి. కానీ ఏ ఒక్క ఘటనలోనూ నిందితులు అరెస్టు కాలేదు. భక్తుల మనోభావాలు కాపాడేందుకు ఏ ఒక్క ప్రయత్నమూ ప్రభుత్వం చెయ్యలేదు.

‘హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు’ అనదగ్గ సుమారు 160 ఘటనలు జరిగినా ప్రభుత్వం అది సమస్యే కాదన్నట్లు అలక్ష్యం చేయడం భక్తులను మరింత బాధించింది. ఈ క్రమంలోనే రామతీర్థం ఆలయంలో రాములోరి తలను విగ్రహం నుంచి తొలగించి అక్కడే ఉన్న కోనేరులో పడేసి పోయారు. ఈ శ్రీరామ నవమి రోజు చెపుతున్నా….టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంటిమిట్ట మాదిరిగా రామతీర్థం దేవాలయాన్ని అద్భుతంగా అభివృద్ది చేస్తాం.

రాష్ట్రంలో దేవాలయాల రక్షణకు, పవిత్రతను కాపాడేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం. ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని ప్రజలకు అందిస్తాం. మరోసారి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

LEAVE A RESPONSE