ఎంఎస్ రాజుకు ఏం జరిగినా డీజీపీదే బాధ్యత

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

ఎస్సీలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు నిరసనగా టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో కావలి కార్యక్రమంలో కోసం బయలుదేరిన టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజును నిన్న అర్థరాత్రి కొందరు పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం రాష్ట్రంలో నెలకొన్న స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి పరాకాష్ట. ఎంఎస్ రాజును పోలీసులు ఏం చేశారో ఇప్పటివరకు సమాచారం లేదు. గత కొంతకాలంగా రాష్ట్రంలో అణచివేతకు గురైన దళితులగొంతుకగా పోరాడుతున్న ఎంఎస్ రాజుపై ప్రభుత్వం పథకం ప్రకారమే వేధింపు చర్యలకు పాల్పడుతోంది. దళితుల హక్కుల కోసం పోరాడుతున్న ఎంఎస్ రాజుకు ఏం జరిగినా రాష్ట్ర పోలీసు విభాగాధిపతి రాజేంద్రనాథ్ రెడ్డి దే బాధ్యత. ఎంఎస్ రాజుతోపాటు పోలీసులు అదుపులోకి తీసుకున్న దళితనేతలందరినీ తక్షమే భేషరతుగా విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply