– ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి
– ఏ 33 గోవిందప్ప బాలాజీ
– అరెస్టు ఖాయం?
అమరావతి: జగన్ జమానాలో అంతా తానై చక్రం తిప్పిన ఆయన అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి ప్రమాదంలో పడ్డారు. లిక్కర్ స్కాంలో తాజాగా ఆయన పేరు చేర్చారు. ఇప్పటికే ఆయనతోపాటు ఓఎస్డీ కృష్ణమోహన్,భారతీ సన్నిహితుడు బాలాజీ సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన క్రమంలో వారి అరె స్టు ఖాయంగా కనిపిస్తోంది.
మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మెమో వేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను చేర్చారు. అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వీళ్ల పేర్లు చేర్చినట్లు సిట్ అధికారులు మెమోలో పేర్కొన్నారు.