Suryaa.co.in

Andhra Pradesh

గెలిచిన తర్వాత ఖనిజ సంపదల ప్రత్యక్ష దోపిడీ

– 80 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఏమయ్యాయి?
– రీచ్‌లలో ఇసుక మాయం చేసిన కూటమి నేతలు
– వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఖనిజసంపదల దోపిడీకి మాస్టర్‌ స్కెచ్‌ వేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇసుక దోపిడీని వ్యవస్ధీకృతం చేసి… ప్రత్యక్ష దోపిడీకి దిగారని మండి పడ్డారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పద్ధతి ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా దసరా పండుగ సందడిలో ఉంటే … తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసుక, మద్యం టెండర్ల పండుగలో ఉన్నారని తేల్చి చెప్పారు.

ఎవరూ పాల్గొనే అవకాశం ఇవ్వకుండా…. గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీచ్‌ల టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ… దోపిడీకి తెరలేపిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందికి టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేసారు. కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

టన్ను ఇసుక తవ్వాడానికి రూ. 90 నుంచి 120 గా బేస్‌ ధరగా టెండర్లలో నిర్ణయించి, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ. 50 నుంచి రూ. 60కి తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం వెనుకున్న మర్మమేంటని నిలదీశారు. ఇసుక టెండర్లలో అక్రమాలకు ఈ ధరలే నిదర్శనమని చెప్పారు. ఇసుక టెండర్లు దక్కించుకోవడానికి అతి తక్కువ ధరకు కోట్‌ చేయడం, సామాన్యులు బెదిరించడం, దౌర్జన్యం చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడుతూ తెలుగు తమ్ముళ్ల బరి తెగించారని మండిపడ్డారు.

తూర్పుగోదావరి జిల్లాలో 17 రీచ్‌ లుకు, 48 గంటల్లో టీడీపీ నేతల నుంచి బిడ్‌ లు స్వీకరించి ఖరారు చేసేసారని, అలాగే కర్నూలులో అసలు నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే . ఒక్క టెండర్‌ వస్తే బిడ్‌ ను ఓకే చేసారని తెలిపారు. వైఎస్సార్, పల్నాడు, తూ. గో , ప.గో, అనంతపురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చితూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక బుకింగ్‌ లేనే లేదని, తెలుగు తమ్మళ్లు, బీజేపీ, జనేసేన నేతలతో కలసి బ్లాక్‌ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

టన్ను ఇసుక తవ్వాడానికి రూ. 90 నుంచి 120 గా బేస్‌ ధరగా నిర్ణయించగా, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ. 50 నుంచి 60 తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం అవినీతి ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. వైఎస్సార్, పల్నాడు, తూ. గో , ప.గో, అనంతపురం, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చితూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాలో ఇసుక బుకింగ్‌ లేనే లేదని ఆరోపించారు.

రాష్ట్రంలోని వివిధ రీచుల్లో గత వైసీపీ ప్రభుత్వం స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను, నాలుగు నెలల కాలంలో అమ్ముకున్నారని,కూటమి పాలనలో ఇదో అంతర్జాతీయ కుట్ర అని మండిపడ్డారు.

ఇసుకను వంద శాతం ఉచితంగా ఇవ్వాల్సిందేనని, ఇసుక విధానాన్ని తక్షణమే ప్రకటించాలని, ఇసుక టెండర్లను రద్దు చేయాలని సుధాకర్‌ బాబు డిమాండ్‌ చేసారు. లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE