ఊరకే హాస్పిటల్ లోకి జొరబడ వద్దు

హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
మిత్రులారా…. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే తొందరపడి హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు.

ఔట్ పేషెంటుగా బయట క్లినిక్కూలో ఇద్దరు, ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి, తప్పులేదు. అంతేగానీ, ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి వైద్యులు పెట్టే భయాలకు లొంగి ICU, IPగా జాయిన్ కావద్దు.
నేడు చాలా మంది కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్లో జరిగే విషయాలు చాలా భయానకంగా ఉంటున్నాయి. పైకి కనబడేటంతగా అందంగా మాత్రం ఆలోచనలు లేవు. హాస్పిటల్ మేనేజ్మెంట్ పెట్టే టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సివస్తుంది అందులో పనిచేసే డాక్టర్స్.
డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది. అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.

ఉదాహరణగా సినీ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICUలో ఉంచడమే.ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి కూడా ఎక్కడ వస్తుందో అని ముందు జాగ్రత్తగా టైం పాస్ గా ఎంజీఎం హాస్పిటల్లోకి పోయాడు. అదేదో మంచి హాస్పిటల్ అనుకున్నాడు… కానీ, అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు పాపం. రెండు కోట్లు బిల్లు వసూలు చేశారు, శవాన్ని మాత్రం ఇచ్చారు.దాసరి నారాయణరావు, జయలలిత…. ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి, టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీబయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.

తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు, డబ్బు ఉన్నవారు. వైద్యాన్ని చాలా మిస్టరీగా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం… అది ముమ్మాటికి తప్పు.
అసలు అన్ని రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొనిపోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి శరీరం పూర్తిగా క్షీణించి పోదా??

అదే జరిగింది ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.
అందుకే మిత్రులారా హాస్పిటల్… అది ఎలాంటిదైనా మొదట ఔట్ పేషెంటుగా సేవలు (అత్యవసరం అనిపిస్తే తప్ప) పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే హాస్పిటల్లోకి జొరబడ వద్దు.
నానాటికీ అత్యంత మోసపూరిత వ్యవస్థగా మారుతోన్నది వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతి దానికి కార్పొరేట్ హాస్పిటల్లోకి పోవడం కరెక్ట్ కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు.
హాస్పిటల్ కి పోతే రేపే అన్నట్లుగా తయారైంది. ఇప్పుడు Omicron మధ్య వచ్చి రోజు రోజుకు కేసులు పెరిగిపోయి 3వ waveగా ఫిబ్రవరిలో రానున్నదని స్వయంగా ప్రభుత్వాలే ప్రకటనలు చేశాయి. క్రొత్తగా అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఒకే రోజు 85,000 కేసులు నమోదైనట్లు వార్తలొచ్చాయి.
జాగ్రత్త… జాగ్రత్త… జాగ్రత్త…

Leave a Reply