Suryaa.co.in

National

ఎవరినీ తక్కువగా అంచనా వెయ్యకు

ఇతని పేరు స్వపన్ దిబ్రామ, రైల్వే ట్రాకుల పక్కన కాయితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుని బ్రతుకుతుంటాడు. పక్కనున్న అమ్మాయి అతని కూతురు. రొజులాగానే రైల్వేట్రాకు పక్కన కాయితాలు ఏరుకుంటున్న వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపొయి కనిపించింది. త్రిపురలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ భూమి కొసుకు పొయి, అక్కడ పటాలు విరిగిపొయాయి. అంతలొ అటువైపు నుండి 2000 మంది పాసింజర్లతొ ట్రైన్ వస్తుంది. అంతే స్వపన్ దిబ్రామ, అతని కూతురు వెంటనే తమ చొక్కాలను విప్పి, ట్రైన్ ఆపమని చొక్కాలను ఊపుతూ ఆ రైలుకు ఏదురుగా పరుగెత్తుకెళ్ళి, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రైలును ఆపివేయించారు.
దిబ్రామ, అతని కూతురు చేసిన ఈ సాహసం వలన దాదాపు 2000 ప్రాణాలు కాపాడబడ్దాయి. ఈ విషయం తెలుసుకున్న త్రిపుర మినిస్టర్ “రాయ్ బర్మన్”, వీరిద్దరిని అతని అధికార నివాసానికి పిలిపించి, ఇద్దరికీ మంచి బట్టలు కొనిపెట్టి, VIP లు డిన్నర్ చేసే చొట తండ్రికూతుళ్లతొ కలిసి భొజనం చేశారు. అంతేకాకుండా త్రిపుర అసెంబ్లీ వీరిని అభినందించి, వీరు సౌకర్యంగా బ్రతికేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితొ పాటుగా రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగధు బహుమతి ప్రకటించనుంది. వీరికి త్రిపుర ప్రభుత్వం ఆవార్డు ప్రకటించనుంది.

LEAVE A RESPONSE