తెలంగాణ విజయ డెయిరీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 17 లక్షల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద వివిధ సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద అఫ్జల్ గంజ్ చుడి బజార్ లో నిర్వహిస్తున్న రెయిన్ బో హోమ్ కు తెలంగాణ విజయ డెయిరీ ద్వారా ప్రతి రోజు 20 లీటర్ల పాలను ఉచితంగా సరఫరా చేసేలా అనుమతిస్తూ జారీ చేసిన పత్రాన్ని నిర్వాహకులకు మంత్రి అందజేశారు. సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చుడి బజార్ లో నిర్వహిస్తున్న రెయిన్ బో హోమ్ లో ఉన్న 93 మంది బాలికల కోసం ప్రతిరోజు 20 లీటర్లు చొప్పున సంవత్సరం పాటు పాలను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. సొసైటీ నిర్వహకులు శ్రీనివాస్ రెడ్డి, శివరాణి లు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా పాల సరఫరా కు సంబంధించిన పత్రాన్ని అందుకున్నారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…