– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం
విజయవాడ : నాయీ బ్రాహ్మణులకు గౌరవం, గుర్తింపు తీసుకుని రావడమే బీజేపీ ధ్యేయమని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణుల సంఘాలతో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో మాధవ్ నాయీ బ్రాహ్మణుల కు హామీల వర్షం కురిపించారు.
ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగొల గోపి శ్రీ నివాస్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో 26 జిల్లాలకు చెందిన నాయీ బ్రాహ్మణుల జేఏసీ నేతలు అనేక సమస్యల్ని ప్రస్తావించారు.
యుగం ప్రారంభంలోనే నాయీ బ్రాహ్మణుల తమ వృత్తులను సేవగా భావించి పనిచేశారని, భారతీయ ధర్మం లో నాయీ బ్రాహ్మణులు వృత్తి కీలకం. దేవాలయాల్లో తమ వృత్తి పోస్ట్ లు భర్తీ చేయాలని కోరారు.
అయితే నేడు నాయీ బ్రాహ్మణులు వివక్షకు గురవుతున్న పట్టించుకోవడం లేదు. అదే విధంగా కార్పొరేటీకరణ కారణంగా వృత్తులను కోల్పోతున్నామని సంఘాలు పేర్కొన్నాయి.
తమకు సంఘం లో రక్షణ కోల్పోతున్నామ న్నారు. నాదస్వరం ఉద్యోగాల ను అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయడం వల్ల చాలీచాలని జీతం తో గడపాల్సి వస్తుంది. నాయీ బ్రాహ్మణులు ప్రధానంగా క్షౌర శాలలు, నాదస్వరం, డోలు వాయిద్యం, సంప్రదాయ వైద్య వృత్తిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయీ బ్రాహ్మణుల కు మంచి స్థానం ఇచ్చారని బీహార్ ముఖ్యమంత్రి గా పని చేసిన కర్పూరీ ఠాకూర్ భారత రత్న ఇచ్చారని నాయీ బ్రాహ్మణులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఏపీ చీఫ్ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేవాలయాలు లో నాదస్వరం డోలు పోస్ట్ లు భర్తీ కి కూటమి ప్రభుత్వం గా ప్రయత్నం చేస్తామన్నారు.
నాయీ బ్రాహ్మణుల కు రాజ్యాధికారం తో పాటు గౌరవం తీసుకుని వస్తామన్నారు.
నాయీ బ్రాహ్మణుల వల్లనే భారతీయ సాంప్రదాయ భవిష్యత్తు తరాలకు అందించటానికి వీలు కలుగుతుంది అన్నారు. అణగారిన వర్గాల భవిష్యత్తు కాపాడడమే బీజేపీ థ్యేయంగా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అణగారిన వర్గాల కు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు,
నాయీ బ్రాహ్మణుల కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు, బిజెపి చీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిఎస్ఆర్ పట్నాయక్, మురళీ నాయుడు, రామకృష్ణ, నంద బాబ్జీ, తాటి కొండ నరసింహ రావు, తదితరులు పాల్గొన్నారు