Home » ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు

ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు

-తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు
-ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఆరు గారడీలు
– ఖైరతాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు నేతృత్వంలో అయితే మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ బాగుంటుందనే.. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను పెంచుతారో వారే ప్రధానిగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లోని మంత్రులే జైలుకు వెళ్ళిన పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల అవీనితి జరిగింది. అనాడు సోనియా రిమెట్ కంట్రోల్‌లో మన్మోహన్ సింగ్ పనిచేశారు

ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ మన్మోహన్ సంతకం పెట్టేవాడు. వారి హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. దీంతో స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకుడిని కావాలని దేశ ప్రజలు కోరుకున్నారు. దీంతో 2014లో మోదీని ప్రధానిగా ఎన్నుకున్నారు. గుజారాత్‌ను మోదీ చేసిన అభివృద్దిని చూసి ప్రజలు మోదీని కావాలనుకున్నారు.

ఒక్క రూపాయి అవీనితి లేకుండా మోదీ పాలనను కొనసాగిస్తున్నారు. మోదీ పాలనలో ఏ మంత్రి కూడా అవీనితికి పాల్పడలేదు. అవినీతి లేని పాలన అందిస్తామని మోదీ గ్యారంటీ ఇచ్చారు అదే విధంగా పాలన సాగుతుంది. 2014లో 278 సీట్లు వస్తే, 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయి. కరోనా, ఆర్టికల్ 370, త్రీపుల్ తలాక్ లాంటి సమస్యను పరిష్కరించారు. రామమందిరం నిర్మాణంలో మోదీ సమర్ధవంతంగా పనిచేశారు.

ప్రపంచమంతా ఆకర్షించేలా స్థిరమైన పాలన చేశారు. మోదీ గొప్ప లీడర్‌ని అని ప్రపంచంలో అన్ని సర్వేలు వివరిస్తు్న్నాయి. 70 శాతం ఓట్లతో ప్రపంచంలోనే నెం 1 నాయకుడిగా మోదీ ఉన్నారు. ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది.
దీనికి తెలంగాణ ప్రజల బాగస్వామ్యం కావాలి.

మోదీ లాంటి గొప్ప నాయకున్ని మనం మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్న నష్టం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్క స్థానం గెలిచినా అది వృథానే అవుతుందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ఆరు గారడీలు చేసింది.

ఆరు గ్యారంటీలు ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారు. ఆరు గ్యారెంటీలు అయ్యేది కాదు.. పోయేది కాదు.

Leave a Reply