Home » భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా?

భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా?

– ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘీభావ ట్వీట్

భారత క్రికెట్ జట్టుకి 16 టెస్టు మ్యాచుల్లో ప్రాతినిధ్యం 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించి… ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో కనబరిచిన అతని క్రీడా పటిమ మరువలేనిది. ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్‌గా, గత ఏడేళ్లలో ఆంధ్ర జట్టు అయిదు సార్లు నాకౌట్‌కు అర్హత సాధించడంలో సహాయపడింది. విరిగిన చేతితో పాటు.. మోకాలి గాయంతో ఆడిన హనుమవిహారి.. భారత్‌ జట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ జట్టు కోసం తన క్రీడా శక్తినంతటినీ ధారపోశారు.

ఈ రోజు, ఒక వైసీపీ కార్పొరేటర్ కారణంగానే.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు విహారి తన కెప్టెన్సీకి రాజీనామా సమర్పించాల్సి వచ్చింది. మన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కి – భారత క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ టీమ్ కెప్టెన్ కంటే.. ఎటువంటి క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ రాజకీయ నాయకుడు చాలా విలువైన వ్యక్తిగా మారటం.. ఎంత అవమానం!
జగన్‌మోహన్‌ రెడ్డి గారూ! మన ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌ని రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవమానించినప్పుడు.. ‘అడుదాం ఆంధ్రా’ లాంటి కార్యక్రమాల కోసం కోట్లాది రూపాయలు సొమ్ములు ఖర్చు చేసి లాభమేంటి?

ప్రియమైన హనుమవిహారి గారూ, మీరు రాష్ట్రానికి, దేశానికి ఛాంపియన్ ప్లేయర్. మీ విశిష్ట సేవలతో…ఆంధ్రలోని చిన్న పిల్లల్లో స్ఫూర్తిని నింపి.. క్రీడాకారులను ఉత్తేజపరిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.. తెలుగువారిగా.. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వ్యక్తులుగా.. మీకు జరిగిన అన్యాయానికి మన రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్ మీ పట్ల చూపిన వివక్షత చూపిన తీరుకు మేము చింతిస్తున్నాము.

మీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే.. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్‌ అసోసియేషన్‌తో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతారని నేను విశ్వసిస్తున్నాను.

Leave a Reply