Home » త్వరలోనే ఉమ్మడి పౌరసత్వాన్ని తీసుకువస్తాం

త్వరలోనే ఉమ్మడి పౌరసత్వాన్ని తీసుకువస్తాం

– బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. లౌకిక పార్టీ
– ఏపీలో బీజేపీ ఓట్లు పెరిగాయి
– కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. భవిష్యత్తులో అక్కడ కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.‘భారత్ రైజింగ్ అలైట్‌ మీట్’ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పూర్తిస్థాయిలో నెరవేర్చారని చెప్పారు. 370 యాక్ట్, ట్రిపుల్ తలాక్‌లను రద్దు చేయగలిగాం. అలాగే త్వరలోనే ఉమ్మడి పౌరసత్వాన్ని తీసుకువస్తాం. భారత్ బలహీనమైన దేశం కాదు..బలమైన దేశమని చెప్పారు రాజనాథ్ సింగ్.

భారతదేశం 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని అన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదు.. లౌకిక పార్టీ అని చెప్పారు. డిజిటల్ ఎకానమీలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.. దేశంలో అన్ని ప్రాంతాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Leave a Reply