Suryaa.co.in

Telangana

ఈటల రాజేందర్ సేవలు దేశానికి కూడా అవసరం

-మీరు గెలిపించి పంపించండి
-దేశాభివృద్ధిలో మోదీ తో కలిసి పనిచేస్తారు
– కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి
-మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్

ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ కేంద్రమంత్రులు, ఈటల సమక్షంలో కాషాయకండువా కప్పుకున్నారు. వారిని నాయకులు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి మాట్లాడుతూ .. ఈటల రాజేందర్ నామినేషన్లో పాల్గొనేందుకు పార్టీ నన్ను ఇక్కడికి పంపించింది. హాజరైనందుకు సంతోషంగా ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం చాలా విశిష్టమైనది. మినీ ఇండియా. ఈటల రాజేందర్ జనప్రియ నేత, అనుభవజ్ఞుడు. 7 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. కరోనా సమయంలో ప్రజలకు ఆయన చేసిన సేవలకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను.

ఈటల రాజేందర్ ను గెలిపించి లోకసభకు పంపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన అనుభవం సేవలు ఢిల్లీలో కూడా అవసరం. తెలంగాణలోనే కాదు భారతదేశ అభివృద్ధిలో మోదీతో కలసి పనిచేస్తారని అనుకుంటున్న. ఈటల గెలిచిన తరువాత మళ్ళీ వస్తా.. ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్న అని కేంద్రమంత్రి అన్నారు.

LEAVE A RESPONSE