టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన ఆర్థిక మంత్రి బుగ్గన

టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరామర్శించారు. ఈవో ధర్మారెడ్డి స్వగ్రామమైన పారుమంచాల వెళ్లి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ధైర్యంగా ఉండమని పుత్రశోకంలో ఉన్న ధర్మారెడ్డిని మంత్రి బుగ్గన ఓదర్చారు. అంతకు ముందు ఆకస్మిక గుండెపోటుతో చెన్నై ఆసుపత్రిలో చంద్రమౌళిని చేర్చిన సమయంలోనూ మంత్రి బుగ్గన వెళ్లి ధర్మారెడ్డిని కలిసి వచ్చారు.

Leave a Reply