Suryaa.co.in

Andhra Pradesh

చేతకాని బాబుకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారా..?

– 2022- బాబు, టీడీపికి బూతుల నామ సంవత్సరం
– రాష్ట్ర ప్రజలకు విజయనామ సంవత్సరం
– మీ అధికార దాహానికి ప్రజలు బలిదానాలు చేయాలా?
– కందుకూరు ఘటనలో బాబును అరెస్టు చేయాలి
– పప్పు గళంగా మార్చుకో లోకేష్..!
– బాబు సవాల్ ను స్వీకరిస్తున్నా.. బీసీల సంక్షేమంపై చర్చకు నేను సిద్ధం
– డేట్, టైమ్, ప్లేస్‌… చెబితే నేనే చర్చకు వస్తా…
– 2024లో మరోసారి బీసీలు బాబు నడ్డివిరుస్తారు
– 82 వేల మంది బీసీలను ప్రజాప్రతినిధులను చేసింది జగన్ 
– మంత్రి జోగి రమేష్

మంత్రి జోగి రమేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే…
బాబు-టీడీపికి బూతుల నామ సంవత్సరం-ప్రజలకు విజయనామ సంవత్సరం
మేము గర్వంగా చెబుతాం. మా ప్రభుత్వం 2022లో నేరుగా నగదు బదిలీ(డీబీటీ ) ద్వారా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద కాపు అక్కచెల్లెమ్మలకు, అగ్రవర్ణాల్లోని పేదలకు అత్యధికంగా ప్రయోజనం చేకూర్చిన సంవత్సరం.సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా, ఆరోగ్య పరంగా 2022.. రాష్ట్రానికి విజయనామ సంవత్సరం.
2023లో మనసున్న జగన్‌  నాయకత్వంలో ఇంకా రెండడగులు ముందుకేసీ డీబీటీ ద్వారా ప్రతి గడపకు దగ్గరయ్యే లా మరింత మేలు చేస్తాం. 2022, 2023 చంద్రబాబుకు, టీడీపీకి పచ్చి బూతులు తిట్టే సంవత్సరాలు – బాబు, లోకేష్, అచ్చయ్య, బుచ్చయ్య, పవన్‌ ఎలా తిట్టాలో ట్రెయిన్డ్‌ సంవత్సరంగా మారబోతోంది.
2022 చంద్రబాబునాయుడికి, టీడీపీకి బూతుల నామ సంవత్సరం. బూతుల పురాణం లంకించుకున్న నామ సంవత్సరం. ఆ పార్టీకి ఒక్క విజయం లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ
ఘోరాతిఘోరంగా , ఆఖరికి సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపాల్టీలో సైతం ఘోరంగా ఓడిన సంవత్సరం…

బాబు బూతుల నామ సంవత్సరం… ఎలాగంటే…
“బోషడికే, నీయయ్య, నీ యమ్మ, ఒరేయ్, అరేయ్, నా కొడకా…”అంటూ బాబు నుంచి లోకేశ్‌ , అయ్యన్న పాత్రుడు, అనిత , దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ వరకు వీరందరికీ.. ఇది బూతుల నామ సంవత్సరం .
ఈ రోజు అభివృద్ధి అంటే ఏ ఒక్కరికే పరిమితం కాదు. రాష్ట్రంలోని పేదలందరి అభివృద్ధి. చంద్రబాబు హయాంలో తన వర్గానికో, తన కులానికో అభివృద్ధి సాధిస్తే అది కాదు అభివృద్ధి. జగన్‌ హయాంలో ప్రతి వ్యక్తి, ప్రతి కులం…అందరూ ప్రగతి సాధించాలన్నదే లక్ష్యం. ఆ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న ప్రభుత్వం మాది…

నిన్న చూశాం… చంద్రబాబు తన చుట్టూ నలుగురు బీసీ సోదరులను పెట్టుకుని, ఇస్త్రీ పెట్టె పట్టుకున్నాడు. మగ్గం నేశాడు. చేపను పట్టుకున్నాడు … సిగ్గు, శరం, చీము నెత్తురు అన్నీ వదిలేశాడు.14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన నీకు అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? ఇస్త్రీ చేసే మేము, కుండలు చేసే మేము, కల్లు గీసుకునే మేము, గొర్రెలు కాచుకునే మేము, మగ్గం నేసే మేము…ఇంకా మా పిల్లలు .. ఇంకెంతకాలం ఇవే వృత్తుల్లో మగ్గిపోవాలి? మా జీవితాలు మారకూడదా.. మేం ఎదగకూడదా?. ఎంత దుర్గార్గుడు చంద్రబాబు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌  .. మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా మైనార్టీల పిల్లలు దేశానికే తలమానికంగా తయారు కావాలని, మా పిల్లలంతా ప్రపంచాన్ని చుట్టి రావాలని, విద్యార్థులకు ట్యాబ్‌లు, బైజూస్‌ కంటెంట్‌ మా చేతుల్లో పెడుతుంటే.. ఈ దుర్గార్గుడు చంద్రబాబు మాత్రం, మేము ఇంకా కల్లు గీయాలని, గొర్రెలు కాయాలని, చూడడమేంటి? మీ నైజం బీసీలకు తెలియదా? మా పిల్లల కోసం జగన్‌ ఇంగ్లిష్‌ మీడియం పెడితే , ఈ బాబు కోర్టుల కెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు. మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్‌ చదువుకుని అమెరికా, ఇంగ్లండ్, కెనడా…దేశాలకు వెళ్లాలా? మరి మేమేం పాపం చేశాం. మా పిల్లలు ఏం పాపం చేశారు.? మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలను మా జగన్‌ మోహన్‌రెడ్డి గారు ఇంగ్లండ్, అమెరికా, కెనడా… పంపిస్తానంటుంటే, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు బాగుపడుతుంటే మీ ఏడుపు ఎందుకు?

చేతకాని బాబుకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారా..?
ఇప్పుడు చంద్రబాబు ఒక్క ఛాన్సివ్వాలని అంటున్నాడు. చేత కానోడికి ఎవరైనా ఛాన్సు ఇస్తారా? చేతకాని దద్దమ్మకు ఎవరైనా ఛాన్సిస్తారా? చెడు చేసిన వారికి మళ్ళీ ఛాన్సిస్తారా?
14 ఏళ్లు మా బీసీలపై, మా ఎస్సీలపై, మా మైనార్టీలపై… ఎక్కి తొక్కావే. మాతో ఊడిగం చేయించుకున్నావే.. మాతో ఓట్లు వేయించుకున్నావే. నీకు ఛాన్సివ్వాలా? దేనికివ్వాలి?. మిమ్మల్ని గెలిపించి.. మేం మళ్లీ ఇస్త్రీ పెట్టె పట్టుకోవడానికా? మగ్గం నేయడానికా? గొర్రెలు కాయడానికా? కుండలు చేయడానికా…? కల్లు గీయడానికా, మీరు వచ్చి మళ్ళీ మాకు మోకులు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తారని ఛాన్సివ్వాలా?ఎందుకు ఛాన్సివ్వాలి మీకు. మీ పిల్లలు మాత్రమే అమెరికా పోయి.. వాళ్లే ఇంగ్లీష్‌ నేర్చుకోవాలా…మా పిల్లలు కులవృతుల్లోనే మగ్గిపోవాలా? బీసీల పట్ల దుర్మార్గుడివి కదా బాబూ..? ఆనాడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మా పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంసీఎ, ఎంబీఏ చేయించారు.. ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది మా బడుగు, బలహీనవర్గాలకు చెందిన పిల్లలు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే, అదంతా ఆ దేవుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి .. 8 వతరగతి నుంచే సీబీఎస్‌ఈ సిలబస్‌ ద్వారా దేశానికి ఆదర్శంగా నిలవాలని మా పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తున్నారు.. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చి, ఇంగ్లిష్‌ మీడియం చదువులు చదివిస్తున్నారు. దేశానికే ఆంధ్రప్రదేశ్‌ తలమానికంగా నిలపాలని శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. పిల్లలకు ట్యాబ్‌ లు ఇవ్వాలని, ఇంజనీర్లు, డాక్టర్లను చేయాలని బాబూ.. నీకు ఏ నాడైనా అనిపించిందా? నీకు వయసు పెరిగింది కానీ, చిన్న మెదడు చితికిపోయింది..

అధికారం కోసం ఇంత దిగజారాలా?
అధికారం కోసం చంద్రబాబు ఇంతగా అర్రులు చాచడమేంటి…?. ఇంత తాపత్రయం ఏంటి? ఏనాడైనా ప్రజలకు మంచి చేస్తే ఓట్లు వేస్తారుగానీ… 2019 ఎన్నికల్లో ఎందుకు చిత్తుగా ఓడించారు? . మళ్లీ ఇప్పుడు బయలు దేరావ్‌…నిన్న గాక మొన్న కందుకూరు వెళ్లావ్‌…8 మందిని పొట్టనబెట్టుకున్నావ్‌…తమ్ముళ్లూ.. మీరిక్కడే ఉండండి..ఉంటారు కదా….నేను వెళ్లి చచ్చిన వాళ్లను చూసొస్తానన్నావంటే.. అధికారం కోసం నువ్వు పడే తాపత్రయం…ఎంత దారుణంగా ఉంది? ఆ రోజు ఎన్టీఆర్‌ను పీకి పాకాన పెట్టేదాకా నిద్రపోలేదు. ఆయన్ని కాటికి పంపించే దాకా వదల్లేదు. కందుకూరులో 8 మంది చనిపోయిన 24 గంటలు గడవకుండానే, వెంటనే ఎవరైనా సభ పెడతారా? అదేమంటే వాళ్లు త్యాగం చేశారంటావా? ఇదేమైనా స్వాతంత్య్ర పోరాటమా? నువ్వు త్యాగం చేయ్‌.. నీ కొడుకును చేయమను… నీకు అధికారం కోసం ప్రజలు బలిదానం చేయాలా? త్యాగాలు చేయాలా? నీకు పిచ్చి పీక్‌ స్టేజ్‌కు వెళ్లిపోయింది. పరాకాష్టకు చేరింది.ఇలాంటి నైజం ఉన్న దుర్మార్గుడు చంద్రబాబు…బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నిన్ను నమ్మరు గాక నమ్మరు. నీకు ఎవరితో ఎటాచ్‌మెంట్‌ ఉంది? నువ్వు ఎవరిని ప్రేమగా పలకరించావు? నీకు ఎవరితోనైనా అనుబంధం ఉందా?

2024లో బీసీలు బాబు నడ్డివిరుస్తారు
ఈ రోజు బీసీలు నీకు దూరమయ్యారంటే …కారణం నీకు తెలియదా? ఆ రోజు నువ్వు వారి తోకలు కత్తిరిస్తానన్నావ్‌…మర్చిపోయావా? మళ్లీ నీ దగ్గర కెందుకొస్తాం.2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నడ్డి విరుస్తాం. వెన్నుపూస కదిలిస్తాం. మమ్మల్ని నువ్వు బానిసలను చేస్తే .. మా జగన్‌ గారు బలవంతులను చేశారు. శక్తి మంతులను చేశారు. బీసీలను తలెత్తుకుని తిరిగేలా చేశారు. 82 వేల మంది బీసీలను ప్రజాప్రతినిధులను చేశారు. బీసీలకు చట్టం చేయాలని కాని, రిజర్వేషన్‌ లు ఇవ్వాలన్న ఆలోచనగానీ ఏనాడైనా మీకు కలిగిందా? నీ మదిలో మెదిలిందా? నిన్నెందుకు చూస్తారు?
సామాజిక న్యాయనిర్ణేత జగన్‌మోహన్‌రెడ్డి గారి వెంట బీసీలు,ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నడుస్తారు. కదం తొక్కుతారు.

పప్పు గళంగా మార్చుకో..
నిన్న చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పాదయాత్ర చేస్తాడట…ప్రతి పప్పుగాడికీ ఇదేదో ఫ్యాషన్‌ అయింది.పాదయాత్రకు పేటెంట్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌ కు మాత్రమే ఉంది. అసలు మీరు పాదయాత్రకు అర్హులా?ఇదేమైనా ఫిజికల్‌ ఎక్సర్‌సైజా? పొలిటికల్‌ ఎక్సర్‌సైజా? సీమ పందికి ఫ్యాంటు షర్టు వేసుకుని నడిచినట్లుంటది నువ్వు పాదయాత్ర చేస్తే… ఏముంది నీకు అర్హత? పాదయాత్ర ఎందుకు చేయాలి? నువ్వు ఎమ్మెల్యేవి కూడా కాదు. మీ తండ్రి నిన్ను దొడ్డిదారిన ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రిని చేశాడు. నీకు ఛాలెంజ్‌ చేస్తున్నాను. ఎన్నికల్లో గెలువు చూద్దాం. వార్డు మెంబర్‌గా గెలవలేని లోకేష్‌ … ఒక వీరుడు, ధీరుడు, ఒక ధీశాలి, దమ్మున్న నాయకుడు, విశాల హృదయమున్న జగన్‌మోహన్‌ రెడ్డి గారిని విమర్శించడమా? ఆయన కాలిగోటికి కూడా లోకేష్ సరితూగలేడు.భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో, చరిత్ర పుటల్లో, చరిత్ర ఉన్నంతవరకు జగన్‌ పేరు శిలా శాసనంగా మిగిలిపోతుంది. మాటకోసం, లక్ష్యం కోసం , ఎంత వరకైనా వెళ్ల గలిగే దమ్మున్న నాయకుడు జగన్‌. దేన్నయినా ఎదుర్కొనే దమ్ముంది.ఆయనతో మీ తండ్రీకొడుకులకు పోలికా..? నీ పాదయాత్ర పేరు యువగళం… ఆపేరు సూటుకాదు. మూడు పేర్లు చెబుతా…ఒకటి సెలక్టు చేసుకో..పప్పుగళం, తుప్పు గళం, చిప్పగళం…ఈ మూడింటిలో ఒక పేరు సూటవుతుంది. ఒకపేరు సెలక్టు చేసుకో. సినీ పరిశ్రమలో కొందరు నీ వెనుక నడవాలంట….తెలంగాణ నుంచి కొందరు నడవాలంట…ఏదో దండు కదలాలంట… ఆంధ్రా నుంచి ఎవరూ రారు…దత్తపుత్రుడేమో బస్సు యాత్ర అంటాడు.
ఒకరు బస్సు…ఇంకొకరు తుస్సు…

175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెడతావా బాబూ..?
బాబూ.. నీకు దమ్ముంటే, రోషముంటే 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెడతాం.. వైఎస్సార్‌సీపీ, జగన్‌ గారిని ఓడిస్తామని ధైర్యంగా చెప్పు చూద్దాం..దత్తపుత్రుడికి, ఆద్దెపుత్రుడికీ చెబుతున్నాం…నువ్వు ఎక్కడ నిలబడాలో నీకే తెలియదు. దత్తపుత్రుడికీ ఛాలెంజ్‌ చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పు చూద్దాం. మీకు తెలిసిందల్లా పనికిమాలిన కొన్ని పత్రికలను, మీడియాను అడ్డం పెట్టుకుని వార్తలు రాయాలి. పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాయాలి. ఆ తర్వాత ఆ పత్రికల్లోని బ్యానర్‌ ఐటమ్‌ ల మీద మీరు చర్చలు చేయాలి. నిత్యం ఇదే మీపని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ మా పార్టీ విజయదుందుభి మోగించబోతోంది. బాబుకు చిప్ప మిగులుతుంది. పవన్‌ కల్యాణ్‌ , ఆ పప్పు, తుప్పు అందరూ కొట్టుకుపోతారు.

బాబును అరెస్టు చేయాలి
కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో బాధ్యుడు చంద్రబాబే. అతనే ఈ సంఘటనకు ప్రేరేపితుడు . అతన్ని ఆరెస్టు చేయాల్సిందే. మనిషి ప్రాణానికి విలువ కట్టి డబ్బులివ్వగానే సరిపోదు చందాలతోనూ సరిపోదు. ఇరుకుసందులో సభ పెట్టి , వారిని బంధించి, వారి చావుకు కారకుడైన వాణ్ని అరెస్టు చేయాలి. డీజీపీ గారికీ ఈ విషయం చెబుతాం…ఇలాంటి సభలపై క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. వేలాది మందివచ్చారని డ్రోన్‌ కెమెరాలు పెట్టి బాబు వంటి వాళ్లు చేసే దుష్ప్రచారం ఏ మాత్రం సహించరానిది. ఈ పన్నాగాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు డిపార్ట్‌మెంట్‌పై ఉంది. మా పార్టీ మీటింగుల్లో ఎక్కడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ దాపురించలేదు. మేం స్పష్టంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సూచనలను పరిగణనలోకి తీసుకుని నిర్వహించాం. డ్రోన్‌లను ప్రయోగించి, తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది సభకు వచ్చారని చూపించేలా ఇలాంటి పనికిమాలిన, తప్పుడు ఆలోచనలు ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి దొంగ ఆలోచన బాబు తప్ప ఎవరూ చేయరు. అధికారాన్ని ఏ రకంగా లాక్కోవాలా ? అని తహతహలాడే చంద్రబాబు తప్ప ఇలాంటి పనులు ఇంకెవరూ చేయరు.

బాబు సవాల్ ను స్వీకరిస్తున్నా.. చర్చకు నేను సిద్ధం
చంద్రబాబు నాయుడు చేసిన సవాల్‌ను స్వీకరించడానికి వైఎస్సార్‌ పార్టీ తరఫున నేను సిద్ధంగా ఉన్నా. బాబుకు దమ్ముంటే బీసీలపై చర్చకు రావాలి. ఆ ధైర్యం బాబుకు లేదు. ఆయన చంచాలు … అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర… ఎవరొచ్చినా పాత్రికేయులు, లేదా ప్రజల సమక్షంలో నేను చర్చకు సిద్ధమే. బీసీల గురించి మేం గళమెత్తితే చంద్రబాబు దొడ్డిదారిన పారిపోతాడు.టైమ్, డేట్, ప్లేస్‌…చెప్పమనండి . మేం చర్చకు సిద్ధం.బీసీలు ఇచ్చే రిటర్న్‌ గిఫ్టు ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో మరోసారి బాబు నడ్డి విరుస్తారు… సిద్ధంగా ఉండు… అని మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE