Suryaa.co.in

National

ప్రధానిగా మూడో సారి…

న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులుగా పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు.. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడో సారి
విశాల భారతం.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.. లెక్కకు మించిన కుల మతాలు.. విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు.. అనేక రాజకీయ వైరుధ్యాలు.. నేతలపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు.. రాజకీయాలపై ఓ విధమైన ఏహ్య భావం.. రాష్ట్రాలపై వారసత్వ కుటుంబాల ఆధిపత్యం.. ప్రాంతీయ పార్టీలకు పెరుగుతున్న ఆదరణ.. ఉనికి కోల్పోతున్న జాతీయ పార్టీలు.. ఇలాంటి పరిస్థితులున్న చోట.. ఒకే ఒక్కడు.. తానే ఓ గ్యారంటీ అని ప్రకటించి.. ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచి గెలిచారు.

నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమయానుకూల రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం లోనూ సిద్దహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహాలతో ఓట్లు రాబట్టుకోవడం లోనూ, ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి.. తనకు అనుగుణంగా మార్చు కోవడంలో ఆరి తేరారు.

అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు.. తనకు అవసరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ..జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు.

LEAVE A RESPONSE