Suryaa.co.in

Andhra Pradesh

అర్ధరాత్రి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్ట్

– నోటీసులివ్వకుండా అరెస్టు చేయటం అన్యాయం: అమర్‌నాధ్
కుప్పంలోని bcn హోటల్ లో ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని లను అరెస్టు చేసిన పోలీసులు. హోటల్ వద్దకు పెద్ద ఎత్తున మొహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు డిఎస్పీ గంగయ్య తో పాటు లోకల్ పోలీసు అధికారులు ఉన్నారు.సోమవారం అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదని.. 14వ వార్డును ఫోర్జరీ సంతకలతో ఏకగ్రీవం చేసుకున్నారని..


టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు 19 మంది టీడీపీ నేతల మీద కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం నుంచి సైలెంట్ గా ఉండి.. మంగళవారం రాత్రి టీడీపీ నేతలు బస చేస్తున్న హోటల్ వద్దకు వెళ్లి అరెస్టు చేశారు. ప్రస్తుతానికి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని ను అదుపులోకి తీసుకున్నారు.
అర్ధరాత్రి కాగా తమను అరెస్టు చేసే ముందు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నోటీసు ఎందుకివ్వలేదని అమర్‌నాధ్‌రెడ్డి ప్రశ్నించగా, డీఎస్పీ ఆదేశాల ప్రకారం తాము అరెస్టు చేయాల్సి వస్తోందని పోలీసులు చెప్పడం గమనార్హం.

LEAVE A RESPONSE