-నవంబర్ 11,12 తేదీలలో విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ
-ఎంపీ విజయసాయిరెడ్డి
రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం విశాఖ రైల్వేజోన్ నెరవేరే సమయం వచ్చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు ప్రధాని మోదీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి నవంబర్ 12న శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని అన్నారు. నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో ప్రధాని పర్యటించనున్నారని అన్నారు.
నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 3వ యూనిట్ ను సీఎం జగన్ గారు జాతికి అంకితం చేశారని అన్నారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్ కు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ గారు 2008లో శ్రీకారం చుట్టగా, నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంతో దాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు.
అరగుండు గంజాయి పాత్రుడు (అయ్యన్నపాత్రుడు) గొలుసులు తెంపుకుని మళ్లీ మొరుగుతున్నాడని మండి పడ్డారు.తెలుగు దొంగల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల భూ ఆక్రమణలు జరిగాయని అన్న అయ్యన్న దమ్ముంటే వాటి సంగతి బయటపెట్టాలని డిమాండ్ చేశారు . నీ పిచ్చి కూతలే నిన్ను ఓడించాయని అయినా నీకు సిగ్గు రాలేదని అయ్యన్నపాత్రుడుపై మండిపడ్డారు.
కాకినాడలో ఐఐఎఫ్టీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే క్యాంపస్ శాశ్వత భవనం యుధ్ధ ప్రాతిపదికన పూర్తిచేయడానికి కామర్స్ మంత్రిత్వశాఖకు తగినంత నిధులు తక్షణమే కేటాయించాలని కోరారు.