– విద్యార్థుల భవిత ఉన్నతంగా తీర్చిదిద్దాలి
– కాస్మటిక్ చార్జీలు నేరుగా విద్యార్థుల అకౌంట్ లోకి
– విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం, వసతి అందించాలి
– ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద, హెల్త్ ప్రోపైల్ తయారుచేయాలి
– బీసీ సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సూచించారు. 2025-26 విద్యాసంవత్సరం బుధవారం నుంచి పునఃప్రారంభం కావడంతో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు.
పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాల విద్యను అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగునెలల అద్దె బకాయిలు విడుదల చేసింది. భవనాల యజమానులతో సంప్రదించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పాఠశాలలో, హాస్టల్ లో పరిశుభ్రత పాటించాలని, దోమల నుంచి రక్షణ కోసం నెట్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, వసతి సామాగ్రి వెంటనే అందించాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర స్థాయి అధికారులు నెలవారీ రిపోర్ట్స్ తెప్పించుకోవాలని, ప్రయత్న లోపాలు లేకుండా విద్యార్థులకు విద్య, వనతులు అందించాలన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు వారి కాస్మటిక్ చార్జీలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నాం. ఇందుకు సంబంధించి విద్యార్థులందరికీ బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
వీడియో కాన్సరెన్స్ లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఎంజెపి సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రటరీ లు తిరుపతి, మద్దిలేటి, ఎంబిసి డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిఇవో అలౌక్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జెడి ఇందిర తదితర ఉన్నతాధికారులు, ఆర్ సి వోలు, ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డన్లు పాల్గొన్నారు.