Suryaa.co.in

Andhra Pradesh

పీయూష్ గోయల్‌తో గౌతమ్‌రెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించామని తెలిపారు. బ్యాక్ లాగ్స్ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక పథకం కింద పలు పరిశ్రమలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం.. ఏడీబీ నుంచి 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని కోరామన్నారు. దీని వల్ల రాష్ట్రంపై కొంత భారం తగ్గే అవకాశం ఉందని గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE