Suryaa.co.in

Andhra Pradesh

రాక్షస ప్రభుత్వాన్ని పారదోలండి!

-అరాచక సర్కారును సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోండి
-కురగల్లు రచ్చబండ సభలో నారా భువనేశ్వరి పిలుపు

మంగళగిరి: రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకకూడదు, గత అయిదేళ్లుగా వేధించిన వైసిపి రాక్షప్రభుత్వానికి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్దిచెప్పాలని నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం కురగల్లులో తనయుడు లోకేష్ తో కలసి రచ్చబండ సభలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…. టిడిపి అధినేత చంద్రబాబునాయుడును 53రోజులు జైలులో పెట్టినపుడు మహిళలంతా నాకు అండగా నిలిచారు. వారి స్పూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించాను. గత అయిదేళ్లుగా అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో అవస్థలు పెట్టింది, స్వేచ్చ,స్వాతంత్యాలు ఓటుతోనే వస్తాయి, అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. గత అయిదేళ్లుగా ఎంతోమంది కార్యకర్తలు తమ జీవితాన్ని త్యాగం చేశారు.

ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారు, కొందరు నాయకులు వెళ్లిపోయినా కేడర్ వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపించారు, వారి కష్టాన్ని మర్చిపోం, వారందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే బాధ్యత నాది. ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కడమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలి. రాష్ట్రవిభజన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమించారు.

ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబానికి తండ్రిలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు కావాలి. మీ ఓటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో పోటీచేస్తున్న లోకేష్ ను స్థానిక ప్రజలు ఆశీర్విదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనేశ్వరి కోరారు.

LEAVE A RESPONSE