Suryaa.co.in

Andhra Pradesh

జైల్లో నన్ను చంపే కుట్ర చేశారు

-పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి
-పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి?
-మాజీ ముఖ్యమంత్రిగా నా భూమిపై ఒక సైకో ఫోటో వేసుకోవాలా?
-బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా?
-ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల పెత్తనం ఏంటి
-రుషికొండను బోడిగుండు చేశారు
-రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు
-కూటమి అధికారంలోకి రాగానేఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
-విశాఖ ప్రజలను నా గుండెల్లో పెట్టుకుంటా
-విశాఖపట్నం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం: ఎప్పుడు నా గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం. నన్ను అభిమానించిన ప్రాంతం. 2019లో అందరూ సైకో జగన్ ను నమ్మి మురిసిపోయి ఓట్ల వర్షం కురిపించారు. కానీ విశాఖపట్నం ప్రజలు విజ్ఞతతో ఆలోచించి విశాఖపట్నంలోని నాలుగు సీట్లలో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. అది మీ ముందు చూపు. ‘జగన్ వస్తే రాజధాని బంధ్, పోలవరం ఆగిపోతుంది. చాలా కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయాలనుకుంటున్నారు. బజారుకి ఒక భూకబ్జాదారుడు తయారవుతాడు. ఊరికి ఒక రౌడీ తయారవుతాడు. జాగ్రత్తగా ఉండాలని’ నాడే చెప్పాను. నమస్కరించి చెప్పాను. విశాఖ ప్రజలు మాత్రం విన్నారు. మిగిలిన వారు జగన్ ను నమ్మారు. నేను చెప్పాల్సినంతగా చెప్పలేకపోయానేమో. ప్రజలను చైతన్యవంతులుగా చేయలేదేమో.

జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బాదుడే, బాదుడు
జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బాదుడే, బాదుడు. గుద్దుడే గుద్దుడు. ఒక్క కుటుంబానికి మంచి జరిగిందా అని అడుగుతున్నా? 2014 లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు లోటు ఉంటే మూడు నెలల్లో కరెంటు కోతలు అధికమించి నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది. మిగులు కరెంటు సాధించాం. తెలుగుదేశం మరలా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం. కాని నా మాట వినలేదు.సమర్థవంతమైన పాలన ఉంటే కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు యూనిట్ కరెంట్ ఉత్పత్తికి రూ.6 ఖర్చు అవుతుంటే.. ప్రస్తుతం రూ.2.50కి సోలార్ పవర్ లభిస్తోంది. అసమర్థ ముఖ్యమంత్రి పాలనతో కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపారు.

విశాఖలో ఐటెక్ సిటీకి సమానంగా మిలీనియం టవర్ నిర్మించి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ టీడీపీ. డేటా సెంటర్ విశాఖకు వచ్చి ఉంటే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చుండేవి. అలాంటి విశాఖ నుంచి పరిశ్రమలు మొత్తం తరిమేసి ఈ ప్రాంత వాసులకు జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు. లూలూ పరిశ్రమ తరమేశారు.. లూలూ వచ్చి ఉంటే టూరిజం అభివృద్ధి చెందేది. విశాఖలో వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? విశాఖలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభిస్తోంది. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. చెత్త పన్ను, ఆస్తి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులు, పేదల బతుకులు బారంగా మారాయి.

హుద్ హుద్ తుఫాన్ సమయంలో మీకు అండగా ఉన్నా
జగన్ లాంటి అహంకారి, సైకో లాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే బుల్రోజర్లతో వారి ఆస్తులను ధ్వంసం చేసే స్థితికి వచ్చారు. ఎంవీఎస్ మూర్తి గారు స్థాపించిన గీతం యూనివర్సిటీకి నేనూ కూడా పూర్తిగా సహకరించా. లాభాల కోసం నిర్మించిన సంస్థ కాదు గీతం..ఎన్జీవో ఆర్గనైజేషన్. దేశంలోనే అత్యున్నమైన యూనివర్సిటీల్లో గీతం యూనివర్సిటీ ఒకటి. అలాంటి గీతం యూనివర్సిటీని బుల్రోజర్లతో ప్రహరీ గోడలు పగలకొట్టే పరిస్థితికి వచ్చారంటే జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ప్రజలు ఆలోచించుకోవాలి. విశాఖను హుద్హు్ద్ తుఫాన్ ముంచెత్తిన సమయంలో హుటాహుటినా వచ్చి సహాయ కార్యక్రమాలు చేశాం. తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.. నేను రాలేను అని తెలిసి కూడా బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చా.

పది రోజుల పాటు విశాఖలోనే ఉండి తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజానీకానికి ఆదుకోని వారికి కొండంత ధైర్యం వచ్చిన తర్వాతనే హైదరాబాద్ వెళ్లా. హుద్ హుద్ తుఫాన్ ముందు విశాఖ.. హుద్హు్ద్ తుఫాన్ విశాఖ అభివృద్ధి అనే విధంగా కష్టపడి పనిచేశాం. విశాఖను స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో సైతం తొమ్మిది సంవత్సరాలు విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించా. హుద్ హుద్ తర్వాత మూడ్రోజులకు ప్రధాని మోదీ వస్తే.. మీరు నాపై చూసిన అభిమానానికి ఆయన అశ్చర్యపోయారు. ఇంత విపత్తు జరిగినప్పటికీ.. మీపై వారికి ఉన్న నమ్మకం చూసి అభినందించారు. మీ అభిమానాన్ని నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశా.

దీపావళి పండుగ వచ్చినప్పటికీ నష్టం వాటిళ్లుతుందని క్రాకర్స్ కాల్చవద్దని పిలుపునిచ్చిన సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. నా మాటకు విలువనిచ్చి ఒక్క టపాకాయ కూడా కాల్చకుండా పండగ చేసుకున్న ఘనత విశాఖ వాసులది. మీలో ఉన్న క్రమశిక్షణ, మంచితనాన్ని నా జీవితంలో ఎన్నడూ మరచిపోలేను. విశాఖ ఈస్టన్ డివిజన్ పవర్ కంపెనీ పరిధిలో బిల్లులు సక్రమంగా చెల్లించిన ఘనత ఈ ప్రాంతవాసులకే దక్కుతుంది. వందకు వంద శాతం ఈ ప్రాంత ప్రజలు కూటమికి వేయాలి.

కూటమి అధికారంలోకి రాగానేఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఉద్యోగస్తులు ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలో నిలబడి మరీ ఓట్లు వేశారు. దాదాపు 90 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదైంది. ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించేవాళ్లం. రూ.16 వేల కోట్ల లోట్ బడ్జెట్‍ లో రాష్ట్రం ఉన్నప్పటికీ తెలంగాణతో సమానంగా 43 శాతం పి‍ట్మెంట్ ఇచ్చిన పార్టీ టీడీపీ. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగస్తులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పిట్మెంట్ ఇచ్చాం. వైసీపీ పాలనలో వారి డిమాండ్ల సాధన కోసం ఉద్యోగస్తులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపలేని పరిస్థితి నెలకొంది.

ఎవరైన ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ప్రశ్నించిన ఉద్యోగులను సస్పెండ్ చేయడమో, రిజర్వ్ లో పెట్టడమో లేక జీతాలు కూడా ఇవ్వకుండా వేధించే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వంపై కసితో ఉద్యోగస్తులందరూ వన్సై డ్ గా పోస్టల్ బ్యాలెట్లో్ ఓట్లేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోస్టల్ బ్యాలెట్‍ లో 70 నుంచి 80 శాతం కూటమికే ఓట్లేశారు. కొన్నిచోట్ల వైసీపీ నాయకులు ఉద్యోగస్తులకు రూ.5 వేలు డబ్బులిస్తే.. వాటికి మరికొంత కలిసి కూటమి అభ్యర్థులకు ఇచ్చారంటే గెలుపు కూటమిదేనని.. గెలుపు ఎవరూ ఆపలేరని అర్థం చేసుకోవాలి.

మంచి వ్యక్తి అయిన విష్ణుకుమార్ రాజు రౌడీపై పోరాడుతున్నారు. ఈ పోరాటానికి ప్రజల అండ అవసరం.. విష్ణుకుమార్ రాజును గెలిపించాలి. ఎన్నికల సమయం దగ్గర పడింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రతి ఒక్కరూ పవిత్రమైన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. మంచి వ్యక్తులను ఆశీర్వదిస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. 2014లో జగన్ తల్లి విజయమ్మను ఓడించిన పంపిన ఘనత విశాఖ వాసులది.

రాజమండ్రి జైల్లో నన్ను అంతమెందించే ప్రయత్నం చేశారు
రాజమండ్రి జైల్లో నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా నేను భయపడలేదు. భగవంతుడు రాసిపెడితే ఏదైనా జరగుతాదని..తప్పుచేయలేదు..కాబట్టే ధైర్యంగా ఉండాలని ముందుకు పోయా. డ్రోన్ లు పంపారు. నన్ను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. సొంత ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వ చర్యలను విమర్శించాడని ఆయనను అరెస్టు చేసి పోలీసు కస్టడీలో టార్చర్ పెట్టారు.

రఘురామకృష్ణరాజును కొడుతుంటే జగన్ రెడ్డి వీడియోలు చూసి ఆనందపడ్డాడు. ఈ ఆనందాన్ని ఏమనాలి? మీ జీవితాల్లో ఎప్పుడైనా చూశారా? రఘురామకృష్ణం రాజుకు సీటు ఇచ్చే విషయంలో ఎంపీ సీటు ఇవ్వలేకపోతే..ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఆదుకున్నాం. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.

విశాఖ వాసుల మంచితనం నాకు తెలుసు. రాష్ట్రంలో అరాచకాన్ని పూర్తిగా నివారించేందుకు ఇక్కడ మంచే శ్రీకారం చుట్టాలి. మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోదీ. ఎవరికీ అనుమానాలు వద్దు. మన రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లు అప్పులు తెచ్చి వ్యవస్థలను పతనం చేశారు. శాంతిభద్రతలు పతనమైపోయాయి. ఉద్యోగాలు లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కేంద్రంలో మోదీ గ్యారెంటీలు ఉన్నాయి.

సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ
సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం. వంద సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. అన్న క్యాంటీన్లను రద్దు చేశాడు. నేడు విదేశీవిద్య, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా లు ఉన్నాయా? పేద పిల్లలకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తే వాటన్నింటిని రద్దు చేశాడు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? మన ఇంట్లో బామ్మను పెట్టి బటన్ ను నొక్కమంటే నొక్కుతూనే ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వడానికి, రోడ్లు వేయడానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, కరెంటు కోతలు లేకుండా చేయడానికి, శాంతిభద్రతలు అదుపు చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. మాట్లాడితే బటన్ నొక్కుతున్నానని చెబుతున్నాడు.

రుషికొండను బోడిగుండు చేశారు
రుషికొండ బోడిగుండు అయ్యిందా లేదా? విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన జగన్ రెడ్డి హైదరాబాద్ లో లోటస్ పాండ్, బెంగుళూరు, కడప, విజయవాడ తాడేపల్లిలలో ప్యాలెస్ లు కట్టుకున్నాడు. చివరకు విశాఖపట్నంలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండపై ప్యాలెస్ కట్టాడు. మీరు ఆ ప్యాలెస్ ను చూశారా? మిమల్ని ఆ ప్యాలెస్ లోకి రానిచ్చారా? నేను, వపన్ కళ్యాణ్ లు వస్తే మమల్ని పోకూడదని అడ్డుకున్నారు. వీళ్ల అబ్బసొమ్మా విశాఖపట్నం. జగన్ రెడ్డికి విపరీతమైన అహంకారం. రుషికొండపై కట్టింది టూరిజం గెస్ట్ హౌస్ అని చెబుతున్నాడు. రూ.500 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ ఎవరైనా కడతారా?

ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల పెత్తనం ఏంటి
రాష్ట్రంలో ఖనిజ సంపద దోచేశారు. స్థానికంగా ఉండేవారికి ఇక్కడ మైనింగ్ పై పెత్తనం ఉందా? ఇసుక దోచేశారు. ఇక్కడ విజయసాయి రెడ్డి పెత్తనం ఏంటి. విజయసాయి రెడ్డి ట్రాన్స్ ఫర్ అయ్యి సుబ్బారెడ్డి వచ్చాడు. అంటే మీరు తప్ప ఉత్తరాంధ్రలో ఎవరు లేరా? ఉత్తరాంధ్ర ప్రజల పెత్తనం ఉండాలి కానీ, వైకాపా నాయకులు పెత్తనం ఏంటి? కేవలం విశాఖలోనే రూ.40 కోట్ల ఆస్తులను కబ్జా చేసిన సైకో గ్యాంగే సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు. వీటిన్నింటిపై చర్యలు తీసుకుంటాం.

పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి?
మీ ఆస్టి మీ పేరున ఉండాలి. కానీ, ఈ భూమి పత్రాలపై జగన్ బొమ్మ ఏంటి. మీ భూమి పత్రాలపై ఆయన బొమ్మ వేసుకుంటే మీకు కోపం రావడం లేదా? ఎప్పుడైనా ఇలాంటి పత్రాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి. రాజముద్రను తీసివేసి జగన్ రెడ్డి తన బొమ్మ వేసుకున్నాడంటే ఎంత అహంకారమో ఆలోచించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ప్రభుత్వ రాజముద్రతో మీ భూమి పత్రాలు మీకిస్తా. జగన్ రెడ్డి ఇచ్చిన ఈ చిత్తు కాగితాలను చింపి చెత్తబుట్టలో వేద్దాం. ఈ విషయాన్ని ప్రతీ ఇంటికి మీరే చేర్చాలి.

మన భూములను సైకో కొట్టేయాలని చూస్తున్నాడు. జగన్ రెడ్డి కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కాదు..జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. ఈ చట్టం ద్వారా మీ భూమికి జిరాక్సు కాపీలు మీకిచ్చి ఒరిజినల్ పత్రాలు ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. బ్యాంకులకు జిరాక్సు కాపీలు ఇస్తే ఒప్పుకుంటాయా? అమ్ముకోవడానికి, రుణాలు తెచ్చుకోవడానికి మీకు వీలుంటుందా? మీ భూమి పత్రాలకు అమెరికాలో ఒక ప్రైవేటు వ్యక్తిని ఓనర్ గా పెడుతాడంట. మీ భూములను మీరు అమ్ముకోవాలంటే జలగ జగన్ పర్మిషన్ అవసరం.

ఇక్కడ ఆయన గుమస్తా..సజ్జలను పెట్టుకుంటాడు. మీరు అమ్ముకోవాలంటే ఆ గుమస్తా పర్మీషన్ కావాలి. మీ భూములపై వేరే వారికి పెత్తనం ఇస్తుంటే అది సమంజసమేనా అని అడుగుతున్నా? మీ భూములకు శాశ్వత పత్రాలు ఉంటేనే వాటిని తారుమారు చేస్తున్నారు. ఇప్పుడు మీ భూములకు చెందిన ఒరిజినల్ పత్రాలు వారి వద్ద ఉంటే మీ భూముల పరిస్థితి ఏమిటీ? అందుకే కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం చేస్తాను. జగన్ రెడ్డి మీకందరికి ఉరివేయాలని చూశాడు. మీరందరు కలిసి మే13 తేదీన జగన్ రెడ్డికి ఉరివేయాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నా భూమిపై ఒక సైకో ఫోటో వేసుకోవాలా? జగన్ రెడ్డికి ఎంత ధైర్యం. అందుకే ప్రమాదాన్ని గుర్తించండి.

. విశాఖ రైల్వే జోన్ కు పనికిమాలిన భూమి ఇచ్చి తిరిగి ప్రధానిపై ఎదురుదాడి చేస్తున్నాడు. బొత్స నీ స్థాయి ఎంత? ప్రధానిపై మాట్లాడుతావా? బొత్సకు బొచ్చు ఊడిపోతుంది. నీ తమ్ముళ్లు ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఈయన మంత్రి, మరలా ఇక్కడ తన సతీమణిని తీసుకొచ్చారు. అంటే ఉత్తరాంధ్రపైన మీ కుటుంబ పెత్తనం ఏంటి? సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు ఈ ప్రాంతాన్ని దోచేస్తే..కమీషన్ కోసం ఒక్క మాట మాట్లాడలేదు.

నా వల్ల హైదరాబాద్ బాగుపడిందని నా మనస్సులో ఎప్పటికీ తృప్తి ఉంటుంది. చెయ్యని తప్పుకు నన్ను జైల్లో పెట్టి హింసించారు. నేను జైల్లో ఉన్నప్పుడు 83 దేశాల్లో నా కోసం పోరాడారంటే, రాష్ట్రమంతా పోరాడంటే.. దానికంటే ఒక నాయకుడిగా నేను ఏమి కోరుకోగలను. 13వ తేదీ ప్రతి ఒక్కరూ ఓటేస్తామని, తద్వారా మార్పుకు నాంది పలుకుతామని హర్షాన్ని, ఆమోదాన్ని, సంకల్పాన్ని తెలియజేయాలి. అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రతిఒక్కరితో ఓటు వేయించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో విష్ణుకుమార్ రాజును గెలిపించాలి. . విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ గత ఎన్నికల్లోనే ఎంపీ అవ్వాల్సింది.. కొద్దిపాటి ఓట్లతో మిస్సయ్యాడు.

ఈ రాష్ట్రంలో పరిస్థితి చూశాక సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ.. వైసీపీ కారణంగా లాభం లేదని ఎమ్మెల్సీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వ్యక్తి వంశీ. విశాఖ సౌత్లోా గాజు గ్లాసుకు ఓటేసి వంశీకి భారీ మెజార్టీతో గెలిపించాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని సంకల్పించిన పవన్ కళ్యాణ్ జనసేన సీట్లు గెలిపించి కానుకగా ఇవ్వాలని కోరుతున్నా. అనుభవజ్ఞుడైన గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు.

గంటా శ్రీనివాసరావు గెలుపు తధ్యం. ఎప్పుడూ ప్రజల్లోనే ఉండే వెలగపూడి రామకృష్ణబాబు అందరివాడు. అందరి మనిషి. విశాఖ ఈస్ట్ లో సైకిల్ గుర్తుకు ఓటేసి రామకృష్ణబాబును భారీ మెజార్టీతో గెలిపించాలి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గణబాబును విశాఖ వెస్ట్ నుంచి సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.

LEAVE A RESPONSE