Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం

టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మాఫియా కేంద్రంగా మార్చారని తెలంగాణ సెటిలర్స్‌ ఫోరం కన్వీనర్‌, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. తన సొంత ప్రాంతమైన పొన్నూరుకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ పాలనలో ల్యాండ్‌, శాండ్‌, డ్రగ్స్‌, గంజాయికి మాఫియా కేంద్రంగా తయారైందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

రాష్టాన్ని చక్కదిద్దాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. తాను పొన్నూరు ప్రాంతంలో పుట్టి పెరిగానని, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి 22 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు చెప్పారు. తన ప్రాంత సమస్యలపై స్పందించి ప్రచారం కోసం వచ్చినట్లు చెప్పారు. పొన్నూరు అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రకుమార్‌, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌లను గెలిపించాలని కోరారు.

LEAVE A RESPONSE