Suryaa.co.in

Andhra Pradesh

పొట్టిలంక తనిఖీ కేంద్రం వద్ద కోటి నాలుగు లక్షల విలువైన బంగారం వెండి వస్తువులు స్వాధీనం

పొట్టిలంక తనిఖీ కేంద్రం వద్ద కోటి నాలుగు లక్షల విలువైన బంగారం,వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముఖద్వారమైన రాజమండ్రి రూరల్ కడియం మండలం పొట్టిలంక 216వ నెంబర్ జాతీయ రహదారిపై సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు గస్తీ చర్యలు చేపట్టారు.ఈ తణికీలు కడియం సిఐ తులసీదర్ ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న విలువైన వెండి, బంగారపు వస్తువులు పట్టుబడ్డాయని రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పి అంబికా ప్రసాద్ వెల్లడించారు.

పలు శాఖల తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో సుమారు కోటి 4 లక్షల రూపాయల విలువైన బంగారం వెండి వస్తువులు తరలిస్తుండగా గుర్తించామన్నారు. ఈ సమాచారాన్ని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తహసీల్దార్ రమాదేవి అధ్వర్యంలో పత్రాలను పరిశీలించారు.తదుపరి విచారణ నిమిత్తం జిల్లా గ్రీవెన్స్ కమిటీకి తరలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు డిఎస్పి అంబికా ప్రసాద్ తెలిపారు.

LEAVE A RESPONSE