Suryaa.co.in

Andhra Pradesh

అంత్యోదయ స్ఫూర్తితో చట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందాలి

– జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభలలో పాల్గొన్న 20 సూత్రాల కార్యక్రమాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
– అరకు నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాల్లో పర్యటించిన దినకర్

అరకు: ఆధునిక సమాజానికి దూరంగా మారుమూల గిరిజన తండాలలో నివసించే చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ పథకాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం పైనంపాడు,అరకు వ్యాలీ మండలం కొత్త బళ్ళు కూడా పంచాయతీ పరిధిలోని సిమిలిగూడ గ్రామాల్లో జాతీయ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా జరిగిన గ్రామసభలలో పాల్గొన్నారు.

ప్రధానమంత్రి జన్మాన్ పథక లబ్ధిదారులతో సమావేశం అయిన క్షేత్రస్థాయిలో పర్యటించి జన్మన్ పథకం ద్వారా నిర్మిస్తున్న గృహాలను పరిశీలించారు. గిరిజన విద్య మరియు గ్రామీణ అభివృద్ధి సంస్థ(త్రెడ్స్) ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేరువ చేసే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజానికి దూరంగా జీవిస్తున్న గిరిజన తండాలు, గ్రామాల్లో ప్రజలకు మౌళిక కల్పనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా విన్నూత్న పథకాలను అమలు చేస్తున్నాయని, తద్వారా గిరిజనులకు మౌళిక వసతుల కల్పన, ప్రభుత్వ పథకాలు అందించడం వంటి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయని, వాటిలో భాగస్వాములై ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎం డి ఓ తేజ పైనంపాడు సర్పంచ్ సీదిరి చెల్లెమ్మ, ఎంపీటీసీ వంతల తమన్న,వార్డు సభ్యులు కె గురుమూర్తి,మాజీ ఎంపీటీసీ సి హెచ్ బాబురావు, థ్రెడ్స్ సంస్థ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE