– అభివృద్ధిలో నాలుగవ స్థానంలో ఉంటానా?
– 40వ స్థానంలో ఉంటానా?? అన్నది ప్రజలే చెబుతారు
– నా గురించి నేనే ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు
– శక్తి వంచన లేకుండా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తున్నాను
– శ్రీనివాసరావు… రవికుమార్ లాంటి బేవర్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా కూడా నేను అనుకున్నది చేసి తీరుతా
– ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలనుకుంటే ఉండి నియోజకవర్గంలోని స్కూళ్లు, వాటర్ ప్లాంట్ లు, పోలీస్ స్టేషన్లను చూడండి
– తొలగించిన ఇండ్లు కాలువగట్లపై ఉన్నాయా? లేదా? పరిశీలించండి
– నా కస్టోడియల్ టార్చర్ కేసు అత్యంత స్పష్టం
– మిలటరీ ఆసుపత్రి రిపోర్టులు … తీసుకువెళ్లి బాదిన గుర్తులు ఉన్నాయి
– జత్వాని కేసులో కుక్కల విద్యాసాగర్ చేత ఫిర్యాదైనా చేయించారు.. నా కేసులో అసలు ఫిర్యాదుదారుడే లేడు
– అక్రమ మద్యం వ్యవహారం లో ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చాడు రాజ్ కసిరెడ్డి చక్కగా చెప్పేశాడు
– ఆ వ్యక్తి పేరు కూడా ఎఫ్ఐఆర్లో కచ్చితంగా చేరుస్తారు.. కాకపోతే కాసింత టైం పట్టవచ్చు
– ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు
ఉండి: రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అంటే కచ్చితంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం తర్వాతి స్థానంలో ఉండి నియోజకవర్గాన్ని ఉండాలన్నదే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అభివృద్ధిలో ఆ మూడు నియోజకవర్గాలతో పోల్చుకోలేమని, వాటి అభివృద్ధికి ప్రభుత్వ నిధులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఆ తర్వాత అభివృద్ధిలో కచ్చితంగా నాలుగవ స్థానంలో ఉండి నియోజకవర్గం ఉండాలన్నదే తన ఆకాంక్ష అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అభివృద్ధిలో నాల్గవ స్థానంలో ఉంటానా? 40వ స్థానంలో ఉంటానా? అన్నది ప్రజలే చెబుతారన్నారు.
ఊరికే నా గురించి నేను మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని, నా శక్తివంచన లేకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. శ్రీనివాసరావు, రవికుమార్ లాంటి బేవర్స్ గాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలను చేసిన కూడా నేను అనుకున్నది, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఉండి నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు
ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవలసి వస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అన్నీ నిబంధనలను పాటిస్తూనే, కాలువ గట్లను ఆక్రమించి ఇళ్లను నిర్మించుకున్న వారికి ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలను ఇచ్చిన తర్వాత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఇళ్లను తొలగించడం జరిగిందన్నారు. బహుశా శ్రీనివాసరావు సాక్షికి అమ్ముడుపోయాడేమో తెలియదన్నారు. శ్రీనివాసరావు ఎవరో నాకు తెలియదని, మొన్ననే టీవీలో చూశానని చెప్పారు.
ఇదిగో రాజుగారు వీడు ఎవడో మిమ్మల్ని ఇలాగ బూతులు తిడుతున్నాడని చాలామంది నాకు వీడియోను పంపారని తెలిపారు. కొంతమంది నేను కూడా దురాగతాలను చేశానని అనుకుంటారేమోనని ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి, ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నానని తెలిపారు. అన్ని కోర్టు సూచనలను అనుసరించే చేయడం జరిగిందన్న ఆయన, పేదవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు.
క్యాష్ కొడితే నన్నే కాదు … జగన్మోహన్ రెడ్డి నైనా తిడతారు
క్యాష్ కొట్టి మైక్ ముందు పెడితే నన్నే కాదు… జగన్మోహన్ రెడ్డి నైనా తిడతారని రఘురామకృష్ణం రాజు అన్నారు. సాక్షిలో రఘురామను నిందిస్తున్న మహిళా అంటూ క్యాప్షన్ తో ఒక కథనాన్ని ప్రచురించారని, యాక్చువల్ గా నా పేరు రాస్తే వ్యూస్ వస్తాయన్నారు. మైకు ముందు పెట్టి రాజు గారిని తిట్టమ్మా అని సాక్షి వాడు క్యాష్ కొడితే తిడుతారని, ఎందుకు తిట్టరని ఎదురు ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, అదే ఇంకాస్త ఎక్కువ క్యాష్ కొడితే వాళ్లే జగన్మోహన్ రెడ్డి ని కూడా తిడతారన్నారు.
ఎవరి చేతనో నన్ను తిట్టించి తిరిగి పేపర్లో ప్రచురించడం వెనుక కుట్ర కోణం దాగి ఉందన్నారు. హిందీ సినీనటి జత్వాని కేసులో నిఘా విభాగం మాజీ అధిపతి సీతారామాంజనేయులు అరెస్ట్, అక్రమ మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్టు అయి కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పిన నేపథ్యంలో సాక్షి దినపత్రిక తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఇటువంటి కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
నిజమైన దుర్యోధనుడు అంటూ తనపై సాక్షి దినపత్రిక అబాండాలను వేస్తోందని, ఇటీవల శాసనసభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సరదాగా దుర్యోధనుడి ఏకపాత్రాభినయం వేసిన నాపై ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని చేస్తోందంటూ మండిపడ్డారు. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఎవరైనా సరే నా నియోజకవర్గానికి వచ్చే జరుగుతున్న అభివృద్ధిని చూడాలన్నారు. స్కూళ్లు, కాలువలు ఎలా అభివృద్ధి చెందాయో ఒక్కసారి గమనించాలని సూచించారు..
రక్షిత మంచినీటి కోసం 70 శాతం గ్రామాలలో మైక్రో ఫిల్టర్ల ఏర్పాటు
ఎన్నికలకు ముందు ప్రజలకు మంచినీళ్లు ఇస్తానని వాగ్దానం ఇచ్చానని, ప్రజలకు సురక్షితమైన మంచినీరు ఇవ్వడానికి 70 శాతం గ్రామాలలో మైక్రో ఫిల్టర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ప్రజలు తాగే మంచి నీరు కలుషితం కాకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మేరకు ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ సురక్షితమైన మంచినీరు ఇస్తానని అన్నారు.
ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా, ప్రజలు, నా స్నేహితుల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కొంతమందికి కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. మొన్న ఎన్నికలలో సింహం గుర్తుతో ఒకరిని నిలబెట్టి, నన్ను ఓడించాలనుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఇప్పుడు వాళ్ల బాధ ఏంటో నాకు తెలియదన్నారు.
అయినా వారికి కాదు తాను జవాబు చెప్పాల్సిందని, నేను ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకానీ చెత్త సాక్షి రాతలకు, శ్రీనివాసరావు వంటి వానికి, ఇంకెవడో ఉల్ఫా గాడి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని కరాకండిగా తేల్చి చెప్పారు .
తొలగించిన ఇండ్లు ఎక్కడ ఉన్నాయో పరిశీలించండి
ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయాలనుకుంటే ఉండి నియోజకవర్గానికి రావచ్చునని పత్రికా ప్రతినిధులకు రఘురామ కృష్ణంరాజు ఆహ్వానం పలికారు. నియోజకవర్గంలోని స్కూళ్లు, వాటర్ ప్లాంట్ లు, పోలీస్ స్టేషన్లను చూడండి… ఎవరైనా సరే ఎటువంటి అభివృద్ధి జరిగిందో ప్రజలకు చెప్పండి. అలాగే ఇండ్లు తొలగించిన ప్రాంతానికి వెళ్లండి. అవి ఎక్కడ ఉన్నాయో… ఎటువంటి పరిస్థితులలో ఉన్నాయో… పక్కనే మంచినీటి కాలువలు ఉన్నాయో లేదో ఇవన్నీ వెరిఫై చేసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు.
శ్రీనివాసరావు… కంట్రోల్ యువర్ టంగ్ … నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు
కమ్యూనిస్టు నాయకుడినని మైకు ఉందని ఎదురుగా పదిమంది ఉన్నారని నోటికొచ్చినట్లు మాట్లాడవద్దని శ్రీనివాసరావును రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. మిస్టర్ శ్రీనివాసరావు మీరెవరో నాకు తెలియదు… నేను ఎవరో మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు… కంట్రోల్ యువర్ టంగ్. 30 రోజుల టైం ఎందుకు,? 300 రోజులు అయినా నేను నేనే. రేపే పెట్టేసుకో. నీ వెధవ సొల్లు రాయడానికి సాక్షి వాడు ఉన్నాడు. వెళ్లి సాక్షిలో కూర్చో… మాట్లాడు. ఆ సాక్షి వాడు ఆల్రెడీ నా గురించి రాశాడు. ఒక్కసారి కాదు ఎన్నోసార్లు రాశాడు.
రఘురామ కృష్ణంరాజు బ్యాంకు కు అన్యాయం చేశాడని… అది చేశాడు, ఇది చేశాడని సాక్షిలో ఎన్నోసార్లు అడ్డగోలు రాతలు ఎన్నో రాశాడు. ఎవరు ఏమి చేశారో అన్ని తేలుతాయి. సాక్షి వాడిని ముందు వాడి కేసులను చూసుకొమ్మను. ఒకటి తరువాత ఒక కేసులు వస్తున్నాయి. సాక్షి గురించి మాట్లాడు శ్రీనివాసరావు. లేకపోతే కుమ్మక్కైపోతే… కుమ్మక్కైపో. ఒళ్ళు మండి మాట్లాడుతున్నాను. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేస్తున్నాను. పనిచేస్తున్నాను… చక్కటి పనులను చేస్తున్నాను. నీలాంటి పిచ్చి కుక్కలు ఎన్ని మొరిగినా… నేను వెనక్కి వెళ్లే ముచ్చటే లేదు.
నువ్వు నన్ను తిట్టావు సాక్షి వాడు వేశాడు. నేను నిన్ను తిట్టాను… సాక్షి వాడు వేస్తాడో లేదో నాకు తెలియదు. సాక్షి వాడు వేస్తాడేమో… వేసినా వేయకపోయినా వేరే విషయం. పనికిమాలిన శ్రీనివాసరావు గురించి నేను ఎక్కువగా మాట్లాడితే జనం నన్ను అపార్థం చేసుకుని అసహ్యించుకునే పరిస్థితి రావచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ప్రభుత్వం ఏమి చేస్తోందని… గతంలో కమ్యూనిస్టులే పోరాడారు
ఉండి నియోజకవర్గ పరిధిలో కలుషితమైన నీటిని సేవించి ఒక బాలిక గుర్తు తెలియని జబ్బుతో మరణించినప్పుడు సిపిఎం నాయకులు గతంలో గట్టిగానే గొడవ చేశారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించిన కమ్యూనిస్టులు, కాలువ గట్లను ఆక్రమించుకొని నిర్మించిన 300 మందికి ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలను, ఇంటి నిర్మాణానికి గ్రాంట్ లను మంజూరు చేసి… ఇండ్ల ను తొలగించే సమయంలో అదే కమ్యూనిస్టులు ఇళ్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారన్నారు.
ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యిందన్నారు. శ్రీనివాసరావు అంటూ ఒకడు వచ్చాడు. 30 రోజులు గడువు ఇస్తున్నాను. లేకపోతే నీ భాగోతం బయట పెడతానని హెచ్చరిస్తున్నాడని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు… ఏమిట్రా నా బొచ్చు నువ్వు నా బాగోతం బయట పెట్టేది… నా భాగోతం అంతా నా ఎన్నికల అఫిడవిట్ లో నేనే చెప్పాను.. ఎవడో కేసు పెట్టాడు. ఎస్ వి హావ్ టు పేస్ ఇట్. ఈ విషయం ఎలక్షన్ అఫీడవిట్ లోనే ఉంది. శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పేది… పైగా వార్నింగా , ఏమి చేశాను నేను.
మీ పార్టీ అంటే గౌరవం ఉంది. విలువలు కాపాడే పార్టీ. ఎంతో కొంత ప్రజావసరాలను గుర్తించే పార్టీ అనే మర్యాద ఉంది. ఆ మర్యాద పోగొట్టుకోవద్దు. ఒక వ్యక్తి మీద అది చేస్తా… ఇది చేస్తా అంటే మేము ఖాళీగా కూర్చుంటామా?, వెధవ సొల్లు ఆపి నన్నే అడిగితే నేనే చెప్పి ఉండేవాణ్ణి శ్రీనివాసరావు. అసలు క్లియర్ గా జరిగిందేమిటి… కోర్టు ఆర్డర్ ను చూపెట్టేవాడిని. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ నేనే అంతటి అహంకారినైతే… ఒకవేళ నేనే దుర్మార్గుడినైతే మిగిలిన ఇల్లన్నీ తీసేసే వాడిని కదా..? నాకు ఏమిటి సరదా… దురద.
అక్కడ వాళ్ళ ఇల్లు తీసేస్తే నాకు ఏమైనా కలిసి వస్తుందా?. ప్రజల కోసమే, ప్రజల ఆరోగ్యం కోసమే కాదా చేసింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కాలువ గట్లను ఆక్రమించుకున్న వారికి ప్రత్యామ్నాయ ఇంటి స్థలాన్ని ఇచ్చి , మూడు లక్షల గ్రాంట్ ఇస్తున్నారు. పైగా ఇంటి నిర్మాణానికి ఎంతో కొంత రుణం వస్తుంది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని చేస్తుంటే… ఆర్టిఏ యాక్టి విస్ట్ నంటూ రవికుమార్ అనే ఉల్ఫా గాడు ఉన్నాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడమే వాడి పని. పక్కా బ్లాక్మెయిలర్. వాడిపై ఇటువంటివి ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు వాడేదో దేశభక్తుడైనట్లుగా… ఒక పొయ్యి క్రియేట్ చేసి దానిపై టమాటాలను పెట్టి సీన్ క్రియేట్ చేయాలని చూశాడు.
ఇల్లంతా పడిపోతే పొయ్యి అలాగే ఉండిపోతుందా?, ఆ పొయ్యి పైనున్న పాత్రలో టమాటాలు అలాగే ఉండిపోతాయా? జనం ఏమైనా తింగరోల్లని అనుకుంటున్నాడా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇదొక బ్లాక్ మెయిల్ వ్యవహారం. నాకు డబ్బులు ఇస్తే ఆపేస్తామని కబురు పెట్టాడు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.. శ్రీనివాసరావు ఒక వాచాలి. కమ్యూనిస్టుల మీద నాకు గౌరవం ఉంది. నేను అందరు కమ్యూనిస్టు పార్టీ నాయకులతో మాట్లాడుతూనే ఉంటాను. ప్రజా సంక్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకొని సహకరిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు.
నిత్యం సంధ్యావందనం చేసే వారు… ఇటువంటి వెధవ పనులు ఎలా చేస్తారన్నది ఎవరికి అర్థం కాని ఫజిల్
నిఘా విభాగం మాజీ అధిపతి సీతారామాంజనేయులు కు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత జైలులో తనకు సంధ్యావందనం చేసుకోవడానికి పూజా ద్రవ్యాలను సమకూర్చాలని కోరినట్లుగా తెలిసిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సంధ్యావందనం, సూర్య నమస్కారం, భగవంతుడికి పూజ చేయడం ప్రతి వారికి అవసరమేనన్న ఆయన, సంధ్యావందనం అంటే ఒక్క బ్రాహ్మణులే చేస్తారని, అది ఒక మంచి ప్రక్రియ అన్నారు.
సంధ్యావందనం వంటి మంచి ప్రక్రియలు చేసేవారు… ఇటువంటి వెధవ పనులు ఎలా చేస్తారనేది ఎవరికి అర్థం కాని ఫజిల్ అన్నారు. సినీనటి కాదాంబరి జత్వాని కేసులో సీతారామాంజనేయులు అరెస్టు చేయగా… జత్వాని ఎవరో తనకు తెలియదని చెప్పారట. ఆ తర్వాత ఆమె బ్యాడ్ గర్ల్ అని పేర్కొన్నట్లు సమాచారం. నా వద్దకు కుక్కల విద్యాసాగర్ వస్తే అది ఏదో చూడమ్మా అని గున్ని కి చెప్పానంతే. చూడమని చెప్పడమే తప్పా అన్నట్లుగా జులాయి సినిమాలో బ్రహ్మానందం ప్రశ్నించినట్లుగా సీతారామాంజనేయులు ప్రశ్నించినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు సెటైర్ వేశారు.
ప్రస్తుతానికైతే 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, నా లాకప్ టార్చర్ కేసులో సూత్రధారుల్లో కీలక వ్యక్తిగా సీతారామాంజనేయులు ఉన్నారన్నది స్పష్టం. ఆ పాత్ర కూడా రావచ్చు. ఇంకా ఏపీపీఎస్సీ కుంభకోణంలో కూడా నిత్య సంధ్యావందని ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఇప్పుడే చట్టం చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని… అప్పుడే ముందస్తుగా ఒక అంచనాకు రావడం కరెక్ట్ కాదేమోనన్నారు.
సీతా రామాంజనేయులు అరెస్టు కంటే 24 గంటల ముందే గోవా నుంచి మద్రాస్ కు వెళ్లి అక్కడ నుంచి ఎక్కడికో వెళ్దామనుకున్నా రాజ్ కసి రెడ్డి పోలీసు విచారణలో చాలా విషయాలను చెప్పినట్లు పత్రికా కథనాలలో చూడడం జరిగిందన్నారు. ఎవరికో ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ముట్ట చెప్పినట్లుగా రాజ్ కసిరెడ్డి పక్కాగా చెప్పినట్లు తెలిసిందన్నారు. రాజ్ కసిరెడ్డి ఎవరికైతే ప్రతినెలా 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముట్ట చెప్పానని చెప్పారో, వారి పేరు కూడా తరువాత ఎఫ్ఐఆర్లో కచ్చితంగా వస్తుంది. కాకపోతే కాసింత సమయం పట్టవచ్చునని అన్నారు.
నా కేసులో ఎటువంటి ఫిర్యాదుదారుడు లేడు
సినీనటి జత్వాని కేసులో కనీసం ఫిర్యాదుదారుడి పేరునైనా చూపించారని, నా లాకప్ టార్చర్ కేసులో ఎటువంటి ఫిర్యాదుదారుడు లేడని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నన్ను పట్టుకొచ్చిన వాడే ఫిర్యాదుదారుడని, వాడే తీసుకొచ్చాడని… వాడే నన్ను చావబాదాడని తెలిపారు. ఈ కేసులో ఏమైనా అరెస్టులు ఉంటాయా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు నీకు ఆ…అనుమానం ఎందుకు వచ్చిందని రఘురామకృష్ణం రాజు ఎదురు ప్రశ్నించారు. ఇన్నాళ్లు అరెస్టులు జరగలేదు కాబట్టి నీకు ఆ అనుమానం రావడం సమంజసమేనన్న ఆయన, ఇకపై ఈ కేసు కచ్చితంగా వేగం పుంజుకుంటుందని తెలిపారు.
సునీల్ కుమార్, సునీల్ నాయక్ లను ఈ కేసులో త్వరలోనే విచారించే అవకాశం ఉంది. నా కేసు అతి స్పష్టమైన కేసు. మెడికల్ ఆసుపత్రి రిపోర్టులు ఉన్నాయి. తీసుకెళ్లి బాదిన గుర్తులు ఉన్నాయి. ఏ ఫిర్యాదు లేకుండానే రిఫ్ రాప్ గాడైన బోరుగడ్డ అనిల్ అనే వాడితో సాక్షి సంతకం పెట్టించుకుని అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకువెళ్లారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. జత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయినప్పుడు… నా కేసులో ఎందుకు అరెస్ట్ చేయరని అన్నారు.