గుంటూరు ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్

ప్రభుత్వ, పోలీసుల నిర్లక్ష్యం, వైఫల్యంతోనే గుంటూరులో తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. తొక్కిసలాట ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తవకముందే ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరిపడ భద్రత ఇవ్వకుండా.. ఇచ్చామంటూ ఎస్పీ స్థాయి అధికారి మాట్లాడటం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. భారీ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ప్రభుత్వం భద్రత ఎందుకు కల్పించడంలేదు? సభకు హాజరైన కొద్దిపాటి పోలీసులు కూడా విధుల నిర్వహించని విషయం వాస్తవం కాదా? తొక్కిసలాట జరగకుండా చూడండని చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. ఘటన జరిగిన క్షణాల్లో రాబందుల్లా వాలి శవరాజకీయాలు చేస్తున్న వైసీపీ మంత్రులు, నేతలు భద్రతపై ఎందుకు స్పందించడంలేదు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరౌతారనే సమాచారం ముందస్తుగా ఉన్నప్పటికీ భద్రత కల్పించకపోవటం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం కాదా? 30 వేల మందికి పైగా హాజరైన సభను 30 మంది పోలీసులు ఏవిధంగా నియంత్రిస్తారు? ప్రభుత్వ భద్రతా వైఫల్య ఘటనలు పదే పదే జరుగుతున్నా పట్టించుకోకపోవటం దేనికి నిదర్శనం? ట్రస్టుల ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం బధ్రత కల్పించదా? ప్రజలకు భద్రత, రక్షణా చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం శవరాజకీయాలు చేయడానికి మాత్రం ముందుంది. గాయపడినవారికి ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

Leave a Reply