Suryaa.co.in

Andhra Pradesh

జీవీఎల్‌కు సీటు రాకపోవటం బాధ కలిగించింది

-జీవీఎల్‌కు సహకరిస్తాం
-సొండికుల సంఘం అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి

విజయవాడ: సొండి కుల సామాజిక వర్గానికి చెందిన తమను ఓబీసీ జాబితాలో చేర్చే విషయమై జీవీఎల్‌ నరసింహా రావు కృషి మరువలేనిదని, ఆయనకు విశాఖ సీటు వచ్చి ఉంటే సహకరించేవారమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెమలిపురి కోటేశ్వర చౌదరి అన్నారు. శనివారం విశాఖలో సంఘ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనకు సీటు రాకపోవటం బాధ కలిగించిందన్నారు. ఆయనకు తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE