Suryaa.co.in

Andhra Pradesh

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాజమండ్రి: రాజమండ్రి అర్బన్‌ విద్యుత్‌ కాలనీ హైవే ఎస్పీ ఆఫీస్‌ ఎదురుగా బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన పార్లమెంట్‌ ఎన్నికల కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌, అతిథిగా పేరెళ్ల చంద్రశేఖర్‌జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, రేలంగి శ్రీదేవి, కృష్ణ భగవాన్‌, కోడూరు లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్‌, కొల్లివలస హారిక, పరిమ రాధాకృష్ణ, పడాల నాగరాజు, బూర రామచంద్రరావు, పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, గుర్రాల వెంకట్రావు, శెట్టిపల్లి శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ: విజయవాడలోని బీజేపీి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌ జీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ, నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్‌రాజు, సాధినేని యామిని, మువ్వల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

LEAVE A RESPONSE