Suryaa.co.in

Telangana

కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

-దేశంలోనే అతిపెద్ద మూర్ఖుడు కేసీఆర్‌
–టీడీపీ నేత ఐలయ్య యాదవ్‌ ఫైర్‌

చంద్రబాబుపై వ్యాఖ్యలకు ఖండన

హైదరాబాద్‌: అధికారం కోల్పోయిన బాధలో కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలాగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కరీంనగర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గుడంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, దేశంలో అతి పెద్ద మూర్ఖుడు కేసీఆర్‌ అని విమర్శించారు. పదేళ్లు దుర్మార్గమైన పాలన చేసిన నీకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న చంద్రబాబు హయాంలో చేనేత కార్మికులు చనిపోతే పట్టించుకోలేదని అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి సారిగా సహకార సంఘాలకు సంబంధం లేని చేనేత కార్మికులను ప్రోత్సహించే ఉద్దేశంతో పథకం చేపట్టారు. ఎక్సైజ్‌ సుంకం విధించని దారాన్ని చేనేత కార్మికులకు సరఫరా చేశారని, నేతబజార్లను జిల్లాలలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు యూనిట్‌ రేటును 1.74 పైసల నుంచి 0.87 పైసలకు తగ్గించిందని, మరమగ్గాల ఆధునికీకరణకు నిధులు ఇచ్చారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేనేతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.

LEAVE A RESPONSE