పంట బీమా చెల్లింపునకు 2019 నవంబర్ 23న ప్రభుత్వం జీవో ఇచ్చినా నిధులు విడుదల చేయలేదని దాఖలైన పిటిషన్పై ఏడాది దాటినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడంతో హైకోర్టు ఫైర్ అయింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఫైనల్గా అవకాశం ఇస్తున్నామని, మరోసారి ఇచ్చేదిలేదని మంగళవారం తేల్చిచెప్పింది. లేదంటే అప్పుడు జరిగే విచారణకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శంకర్ ఏడాది కింద వేసిన పిల్లో ప్రభుత్వం కౌంటర్ వేయకుండా కాలయాపన చేస్తోందని పిటిషనర్ తరఫు లాయర్ రచనారెడ్డి కోర్టుకు చెప్పారు. 2018–19 ఏడాది వానాకాల, యాసంగి పంటలకు పంటల బీమా జీవో ఇచ్చినా నిధులు ఇవ్వలేదన్నారు. నిధుల్లో రాష్ట్రం,కేంద్రం సగంసగం ఇవ్వాలని, ప్రభుత్వం కౌంటర్ కూడా వేయలేదని అన్నారు. దీనిపైహైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. చివరిసారిగా అవకాశం ఇచ్చింది.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…