ఆంధ్రప్రదేశ్ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు కౌశిక్
ఆంధ్రప్రదేశ్ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ గా నియమితులైన హిమాన్షు కౌశిక్ నేడు ఏ.పీ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. 2018 ఐ.ఏ.ఎస్ బ్యాచ్ కు చెందిన వీరు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో
ట్రైనీ ఐ.ఏ.ఎస్ (2019-20), తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్-కలెక్టర్ (ఆగస్టు 2020-జూన్ 2021), శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) – (జూన్ 2021 – 24 జనవరి 2022) గా విధులు నిర్వహించి ఎన్నో ప్రశంశలు పొందారు.