Suryaa.co.in

Devotional

కురుక్షేత్ర యుద్ధంలో ఆ 50 లక్షల మందికి తిండి ఎలా పెట్టారు?

– రోజూ అన్ని వేలమంది మాత్రమే చనిపోతారని నరేషుడు ఎలా ఊహించి వండాడు?

సాధారణంగా పెద్దవాళ్ల ఇళ్లలో జరిగే పెళ్లికి వచ్చే 2,3 వేల మందికి భోజనాలు పెట్టాలంటేనే నానా హైరామా పడుతుంటారు. కిందా మీదా పడుతుంటారు. ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు ఓ 500 మందిని పిలిస్తే వారికి ఏమేం పెట్టాలో అర్ధం కాక చర్చోపచర్చలు చేస్తాం. మరి లక్షల మందికి భోజనం పెట్టాలంటే ఇంకెంత కంగారు పడాలి? మరెంత హైరానా పడాలి? మహాభారత యుద్ధంలో పాల్గొన్న 50 లక్షల మంది సైనికులకి, అప్పట్లో భోజనాలు ఎలా పెట్టాలి? అని అప్పట్లో ఇంకెంత కంగారు పడి ఉండాలి?.. అసలు అన్ని లక్షలమందికి తిండి ఎలా పెట్టారన్నదే కదా అందరి ఆశ్చర్యం? ఆ అద్భుతమేదో చూద్దాం.

మన పురాణాల ప్రకారం ఎన్నోరకరకాల యుద్దాలు జరిగినట్టు మనం విన్నాం, చదివేం:ఉదాహరణకు, రామారావణ యుద్ధసమయములోకాని, “మహాభారత సంగ్రామ సమయంలో కాని అందరికీ భోజనాల ఏర్పాట్లు ఎవరు చేసిఉంటారు” అన్న సందేహము వచ్చినప్పుడు,దానికి సమాధానంగా నేను మహాభారతం నుంచి సేకరించిన చిన్న కథ.

ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకుందాం!

మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు, పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు మాత్రం పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి, రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.

దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు, కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు.

అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా, సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు తప్ప, మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.
అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపి రాజు చెపుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు.. రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది. అందరికీ భోజనాలు తయారుచేసేపని మీరుచేపట్టండి అని చెపుతాడు.

నిజానికి 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే, అది భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో భీముడు యుద్ధంలోపోరాడటం ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.కాబట్టి నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడవు: కావున అందరికీ వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.

నరేషుడు తన సైన్యంతో కలిసి, అక్కడ ఉన్న ఇరువర్గాల సైన్యాలకు భోజనం తయారు చేస్తూఉంటాడు. నరేశుడు ఎలా వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు.ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇది ఎలా సాధ్యం? అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?

ఇలా 18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని,అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు. అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా ఉండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం. ఇలా ఎలా చేశావు? అని అంటాడు.

అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా. దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.
అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని, మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి
kurukshtra1 చెందుతుంది అని చెప్తాడు.అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతారు.
అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు…

శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని…శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో, దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు..అంటే.. శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.

ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

– ఆస్ట్రోకొతారు

LEAVE A RESPONSE