Suryaa.co.in

Andhra Pradesh

తృప్తిగా సర్వీసును ముగిస్తున్నా

– ఇప్పటి వరకు 25 వేల కెమెరాల ఏర్పాటు
– డీజీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ: ‘‘ సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నా. ఏడు నెలలుగా డీజీపీగా పని చేశా. 35 ఏళ్లుగా పోలీసు సేవలను సంతృప్తిగా అందించాననే తృప్తి ఉంది. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ తప్ప, శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయ ’’ ని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు రేపు పదవీ విరమణ చేస్తున్నారు. రాష్ట్ర కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులైన సంగతి తెలిసిందే.

టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తున్నామని, నేరాల రేటు తగ్గిందని మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు కూడా 9.5 శాతం తగ్గాయని తెలిపారు. సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 వేల కెమెరాలను ఏర్పాటు చేశా రు. మార్చి 31 నాటికి లక్ష కెమెరాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని ద్వారకా చెప్పారు.
డ్రోన్లను కూడా దాతల సాయంతో అన్ని చోట్ల అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, వరదల సమయంలో కూడా పోలీసులు మెరుగైన సేవలు అందించారని ప్రశంసించారు. రోడ్ సేఫ్టీ పై ప్రత్యేక దృష్టి సారించామని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని ద్వారకా తెలిపారు.

LEAVE A RESPONSE