Suryaa.co.in

Telangana

అధికారుల వల్లే పథకాలు అందడం లేదు

– రిజర్వేషన్ల పెంపు తర్వాతనే ‘స్థానికం’
– గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
– టి పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్: కొందరు అధికారుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని టి పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ఆ మేరకు పార్టీ కార్యకర్తలు ఇప్పటినుంచే కష్టపడాలని పిలుపునిచ్చారు.

రిజర్వేషన్ల పెంపు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని.. కులగణన నివేదికపై ఫిబ్రవరి 5న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల వైఫల్యం కారణంగా కొంతమేరకు పథకాలు లబ్ధిదారులకు అందడం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి పంపించామని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE