Suryaa.co.in

Telangana

మళ్ళీ చెప్తున్నా..నేను నిలబడతా..మిమ్మల్ని నిలబెడతా

పోటీకి దిగి ఓట్లు చీల్చి మళ్ళీ కేసీఆర్ ను గద్దెనెక్కిద్ధమా?
ప్రజల కోసం త్యాగం చేసాం తప్పా, ఇది మోసం కాదు
రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం కాదు
నాతో ఉన్నవాళ్లే నా వాళ్ళు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన కారణం తెలంగాణ ప్రజలను కేసీఆర్ వాగ్ధానాలు ఇచ్చి మోసం చేస్తున్నాడు కాబట్టి. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ఎన్నో నిరాహార దీక్షలు, ధర్నాలు చేశాం. 3800km పాదయాత్ర చేశాం. ఇవన్నీ కేసీఆర్ నియంత పాలనను అంతం చేయడానికే. ఇప్పుడు కేసీఆర్ ని గద్దె దించే అవకాశం వచ్చింది. అది మనకు కాకుండా మరో పార్టీకి ఆ అవకాశం వచ్చింది.

అలాంటప్పుడు మనం ఆ పార్టీని బలోపేతం చేద్దామా..? లేక మనం పోటీకి దిగి ఓట్లు చీల్చి మళ్ళీ కేసీఆర్ ను గద్దెనెక్కిద్ధమా..? మనకు స్వార్ధ రాజకీయాలే ముఖ్యమా..? తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమా..? ఇన్నాళ్లు నాతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలి. ప్రజల కోసం త్యాగం చేసాం తప్పా, ఇది మోసం కాదు. మోసం చేయడం వైయస్ఆర్ బిడ్డ షర్మిల రక్తంలో లేదు.ఆ అవసరం కూడా లేదు.

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మన పోరాటం ఆగదు. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. మనం రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం కాదు. ప్రజల పక్షాన నిలబడటం కోసం. ఇది గ్రహించి నాతో ఉన్నవాళ్లే నా వాళ్ళు.. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరేవారు. మళ్ళీ చెప్తున్న..నేను నిలబడతా..మిమ్మల్ని నిలబెడత.

LEAVE A RESPONSE