Suryaa.co.in

Andhra Pradesh

మీ కష్టాల్లో ఉంటాను -నారా భువనేశ్వరి

అమరావతి :కార్యక్రమానికి వచ్చిన మహిళా శక్తికి నా నమస్కరిస్తూనే మహిళల కష్టాలు వింటాను, మీ కష్లాల్లో పాలు పంచుకుంటానని నారా భువనేశ్వరి అన్నారు.శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి కాదు. రాజకీయ ప్రసంగాలు చేయడానికి కాదు..నేను మీలో ఒక స్త్రీగా ఆలోచించి మాత్రమే మాట్లాడతాను. మా కష్టాల్లో పాలుపంచుకునే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మహిళ సొంత కాళ్లపై నిలబడడం చాలా గొప్పతనం…గౌరవం కూడా. నేను హెరిటేజ్‌ సంస్థను ముందుకు తీసుకెళుతున్నాను. దీనికి చంద్రబాబుగారే కారణం. నన్ను హెరిటేజ్‌ సంస్థకు ఎండీగా చేసిన సమయంలో నేను భయపడితే చంద్రబాబు నాతో మాట్లాడుతూప పని నేర్చుకో ధైర్యంగా ఉండు, ఆలోచనతో ముందుకు సాగు నువ్వు సాధిస్తావని నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రారంభ దశలో అనేక తప్పులు దొర్లినా. టీమ్‌ వర్క్‌తో నేడు కంపెనీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నాను. మహిళలు ఏ పనినైనా నావల్ల కాదని అనకూడదు…మీరు ఏదైనా సాధిస్తారు. ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు. నేటి కాలంలో శ్రామిక మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నాకు తెలిసింది. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కార్మిక శక్తితోనే సాధ్యం. కార్మికుల చెమట నుండి పుట్టిందే తెలుగుదేశంపార్టీ.నారా భువనేశ్వరి శ్రామికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఎన్టీఆర్‌ కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారు. ఇతరుల ఇంటి కలలను నిజం చేసేందుకు శ్రమించే మీరు, మీకంటూ సొంత ఇల్లు లేక, సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, బియ్యం, ఇలా అన్ని నిత్యావసరాల రేటు పెరగటంతో రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై భారం పెరిగింది. ఈ పెరిగిన రేట్ల వల్ల ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నది రోజు వారి కార్మికులే.

నాసిరకం మద్యం చాలా మందిని ఆస్పత్రి పాలు చేసింది. ఎంతోమంది చావుకి కారణం అయ్యింది. మద్యం తాగే మీ భర్త గురించి, మీ అన్న లేదా నాన్న గురించి మీరు టెన్షన్‌ పడుతున్నారని నేను అర్ధం చేసుకోగలను. ఇంతే కాకుండా సంపాదన కూడా పెరిగిన మద్యం ఖర్చులకే సరిపోతుంది. ఆంధ్రాలోని 77 లక్షల మంది రోజూ వారి కార్మికులు ఉన్నారని అంచనా. దాదాపు 31 శాతం మంది ప్రజలు రోజూ వారి పనులపై ఆధారపడుతున్నారు. కానీ గత ఐదేళ్ళుగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇసుక పనులు ఆపేసి నిర్మాణ రంగాన్ని, నిర్మాణ రంగంపై ఆధారపడిన వారిని రోడ్డున పడేసింది. వైసీపీ అనాలోచిత నూతన ఇసుక విధానం వల్ల నిర్మాణ రంగం మూడు నెలలు పూర్తిగా మూతపడిరది. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం వారి కుటుంబాలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు.

గత ప్రభుత్వంలో ఇచ్చిన చంద్రన్న బీమా నిలిపివేయడంతో మీ ఆరోగ్య సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడిరది. భవన నిర్మాణ కార్మికులు, కార్మికులు, ట్రక్కు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నారు. 5 ఏళ్లలో వైసీపీ హయాంలో దాదాపు 13,500 మంది రోజువారీ కార్మికులు కష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెప్తోంది. 2020 నంబర్‌ 3న నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ సలాం అధికారుల వేధింపులు తట్టుకోలేక తన భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కార్మిక సంస్కరణలు బాబు గారి ప్రధాన అజెండాగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను. ప్రతి కార్మికుడికి నివసించడానికి ఇల్లుతో పాటు మెరుగైన జీవితం, ఆరోగ్యం, పిల్లలకు విద్య అందుబాటులో ఉంటాయి. అంతేకాదు మహిళల కోసం టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి కొన్ని ప్రత్యేక హామీలు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ లో భాగంగా 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలకి నెలకు రూ.1,500 ఇస్తారు. స్కూల్‌ కి వెళ్ళే ప్రతి విద్యార్ధికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తారు. మీకు ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45,000 ఇస్తారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు, ఇది మీరు పనికి వెళ్లడానికి, తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళినపుడు ఉపయోగపడుతుంది.

LEAVE A RESPONSE